CM KCR National Party: ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్న కుమారస్వామి, ఇతర ప్రముఖులు.. వడ్డించిన కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు నిన్న సాయంత్రమే హైదరాబాద్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వచ్చారు. ఇవాళ ఉదయం కేసీఆర్ తో పాటు వారు ప్రగతి భవన్‌లో అల్పాహార విందులో పాల్గొన్నారు. వారికి మంత్రి కేటీఆర్ స్వయంగా వడ్డించారు.

CM KCR National Party: ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో కలిసి అల్పాహార విందులో పాల్గొన్న కుమారస్వామి, ఇతర ప్రముఖులు.. వడ్డించిన కేటీఆర్

CM KCR National Party: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు నిన్న సాయంత్రమే హైదరాబాద్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వచ్చారు. ఇవాళ ఉదయం కేసీఆర్ తో పాటు వారు ప్రగతి భవన్‌లో అల్పాహార విందులో పాల్గొన్నారు. వారికి మంత్రి కేటీఆర్ స్వయంగా వడ్డించారు.

తమిళనాడు నుంచి వచ్చి ‘విదుతాలై చిరుతైగల్ కట్చె’ (వీసీకే) పార్టీ ప్రతినిధుల బృందం కూడా ఇవాళ ఉదయం ప్రగతి భవన్ కు వచ్చింది. వారందరినీ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారు కూడా అల్పాహార విందులో పాల్గొన్నారు. పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర ప్రజాప్రతినిధులు కూడా ప్రగతి భవన్ వచ్చారు.

అలాగే, ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు కూడా ప్రగతి భవన్ వచ్చారు. కాగా, కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ సర్వసభ సమావేశం ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకోనున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..