Omicron: 26దేశాలకు ఒమిక్రాన్.. అమెరికాలో తొలి కేసు.. భారత్లోనూ భయం భయం!
ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది.
Omicron: ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది. లేటెస్ట్గా అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ఓ వ్యక్తిలో ఒమి గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈలోనూ ఒమిక్రాన్ తొలి కేసులు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల సంఖ్య 26కు పెరిగినట్లు అవుతుంది!
ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తం అయ్యింది. కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షల నిబంధనలను కఠినతరం చేయబోతున్నట్లు ప్రకటించింది. అమెరికాకు వచ్చే ప్రయాణికులు జర్నీకి ఒక్కరోజు ముందుగానే వైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకునే విధంగా నిబంధనలు తీసుకురానున్నట్లు అమెరికా సీడీసీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ గడువు మూడురోజులుగా ఉంది. వ్యాక్సిన్ తీసుకోనివారికి, తీసుకున్నవారి కూడా ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొవిడ్ టెస్టింగ్ విధానంలో మార్పులు చేసేందుకు సీడీసీ యత్నిస్తోందన్నారు డైరెక్టర్ రోచెల్. నూతన నిబంధనలతో వైరస్ నిర్ధరణ పరీక్షల సమయం తగ్గనుందన్నారు. ఇది అన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుందని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రయాణాన్ని ఎలా సురక్షితం చేయాలన్నదానిపై.. క్వారంటైన్ విధానంపైనా సీడీసీ సమీక్షిస్తోందని తెలిపారు.
Omicron Cases: వామ్మో ఒమిక్రాన్.. 21దేశాల్లో వెలుగులోకి కొత్త వేరియంట్!
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ ప్రభావం ఇప్పుడు భారత్పైనా పడింది. ఆఫ్రికా దేశాల నుంచి ఇటీవల భారత్కు వచ్చినవారిలో చాలామంది ఆచూకీ లభ్యం కావడంలేదు. పాస్పోర్టుల్లో పేర్కొన్న చిరునామాల్లో వారు ఉండకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరి ద్వారా కొత్త వేరియంట్ స్థానికంగా వ్యాపించే ముప్పుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్రికా దేశాల నుంచి గత 15రోజుల్లో సుమారు వెయ్యి మంది ముంబైకి చేరుకున్నారు. వీరిలో 466 మందిని గుర్తించి, ఆఫ్రికా దేశాల నుంచి బిహార్కు వచ్చిన 281 మందిలో సుమారు 100 మంది కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ప్రమాదం పొంచి ఉన్న దేశాల నుంచి మహారాష్ట్రకు చేరుకున్న ఆరుగురు అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలింది. ఆ జాబితాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను గుర్తించిన దేశాలు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.