Sri Lanka Crisis : ఇంధన కొరతతో స్కూళ్లు, ఆఫీసులు మూసివేత
శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది.

Sri Lanka Crisis : శ్రీలంక తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రోజు రోజుకు పరిస్ధితులు మరింతగా దిగజారుతున్నాయి. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ బంకుల వద్దు డబ్బాలతో ప్రజలు రోజుల కోద్దీ పడిగాపుల కాసే పరిస్ధితి కొనసాగుతోంది. ఇంధన కొరత తీవ్రమైన నేపధ్యంలో చర్యలు చేపట్టిన శ్రీలంక ప్రభుత్వం అక్కడ పాఠశాలలను తాత్కాలికంగా మూసి వేసింది.
అత్యవసర సేవలు మినహా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ఆఫీసులకు రావద్దని సూచించింది. దీనితో పాటు ప్రవేట్ పాఠశాలలకు కూడా శుక్రవారం నాడు మూసివేయాలని ఆదేశించింది. అయితే ఇవి ఎప్పటి వరకు కొనసాగుతాయనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు దేశంలో ఒక రోజుకు సరిపడా మాత్రమే పెట్రోల్ నిల్వలు ఉన్నట్లు ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే ప్రకటించారు. అయితే పెట్రోల్ తో పాటు ఇతర ఇంధనాల కొరత కూడా శ్రీలంకను వేధిస్తోంది. వీటికోసం ప్రజలు రోజుల తరబడి వేచి ఉండటంతో అక్కడ ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. ఇంధన దిగుమతికి డాలర్లు లేకపోవటంతో అంతర్జాతీయ సంస్ధలు, విదేశీ సహాయం కోసం శ్రీలంక ప్రభుత్వం ఎదురు చూస్తోంది.
Also Read : Satya Nadella: సత్యనాదెళ్ల పెట్టుబడిదారుడిగా ఐపీఎల్ స్టైల్లో అమెరికాలోనూ టీ20 లీగ్
ఇవన్నీ ఇలా ఉంటే దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోంటోంది. గడిచిన 70 ఏళ్లలో తొలిసారి రుణాలను కూడా ఎగవేసింది. ఆ దేశం చెల్లించాల్సిన 78 మిలియన్ డాలర్ల రూణానికి సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా ముగిసి పోవటంతో అధికారికంగా ఎగ్గోట్టినట్టైంది. ఈ విషయాన్ని క్రెడిట్ ఏజెన్సీలు ధృవీకరించాయి. కాగా ప్రస్తుతం దేశం ముందస్తు దివాళాలో ఉందని ఆ దేశ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ నందలాల్ తెలిపారు.
- Wickremesinghe: మా దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం 2024 వరకు కొనసాగొచ్చు: శ్రీలంక ప్రధాని
- PM Modi: లక్ష్యాన్ని ముందే సాధించిన భారత్: మోదీ
- Sri Lanka: శ్రీలంకకు మరో 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ పంపిన భారత్
- Sri Lanka Crisis : లీటరు పెట్రోల్ దొరక్క రెండు రోజులు చిన్నారి మృతి
- VAT on Petrol,Diesel : పెట్రోల్,డీజిల్పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు
1Ayodhya Kissing Wife : అయ్యో పాపం.. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను ఉతికారేసిన జనం.. వీడియో వైరల్
2Uddhav Thackeray: ఉద్ధవ్కు కోవిడ్ నెగెటివ్.. అధికార నివాసాన్ని వీడనున్న సీఎం
3Telangana Covid Terror Update : తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు
4MVA Crisis: కూటమి నుంచి శివసేన బయటకు రావాలి: ఏక్నాథ్ షిండే
5DHFL: 34 వేల కోట్ల మోసం.. డీహెచ్ఎఫ్ఎల్ మాజీ ప్రమోటర్లపై సీబీఐ కేసు
6Samsung Galaxy M13 5G : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫీచర్లు లీక్.. త్వరలో ఇండియాకు..!
7Cricketer Suicide Attempt : జట్టులోకి ఎంపిక చేయలేదని.. క్రికెటర్ ఆత్మహత్యాయత్నం
8KAPaul On Draupadi Murmu : అట్లుంటది పాల్తోని.. ఆమెను రాష్ట్రపతి చేయమని చెప్పింది నేనే-కేఏ పాల్
9Ketaki Chitale: 40 రోజులుగా జైల్లోనే నటి.. బెయిల్ మంజూరు
10Miami Airport Plane : విమానంలో ఒక్కసారిగా మంటలు.. తప్పిన పెనుప్రమాదం..!
-
Patna High Court : జడ్జీల కోసం ఐఫోన్ 13ప్రో తక్కువ ధరకే కొననున్న పట్నా హైకోర్టు..!
-
Telegram Premium : టెలిగ్రామ్ మానిటైజేషన్ ప్లాన్ వచ్చేసింది.. ప్రీమియంతో బెనిఫిట్స్ ఏంటి?
-
Ramarao On Duty: రామారావు చార్జి తీసుకునేది అప్పుడే!
-
Xiaomi 12 Ultra : షావోమీ 12 అల్ట్రా ఫోన్ వస్తోంది.. జూలైలోనే లాంచ్..!
-
Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
-
Samsung Galaxy F13 : శాంసంగ్ గెలాక్సీ F13 వచ్చేసింది.. ఈ నెల 29 నుంచే సేల్.. ధర ఎంతంటే?
-
Vaarasadu: ‘వారసుడు’ రాకతో నిజమైన సంక్రాంతి..!
-
Telugu Film Industry Strike: ఫిలిం ఛాంబర్లో నిర్మాతల సమావేశం.. షూటింగ్ ఆపేదే లేదు!