TikTok Star : 2027 నాటికి భూమిపై ఇతనొక్కడే బతికి ఉంటాడట..!

2027లో భూమిపై మానవులు ఎవరు ఉండరంటూ టిక్ టాక్ స్టార్ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 40 నిమిషాల నిడివిగల ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సాధించింది.

TikTok Star : 2027 నాటికి భూమిపై ఇతనొక్కడే బతికి ఉంటాడట..!

Tiktok Star

TikTok Star : సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు అందరిని కట్టిపడేస్తాయి. వీడియో నిడివి పెద్దగా ఉన్నా.. ఇంటరెస్ట్ గా ఉంటే తల తిప్పకుండా చూస్తూ ఉండిపోతారు. ప్రస్తుతం ఇటువంటిదే ఓ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి వీడియో తీసుకుంటూ రోడ్ల మీద‌, షాపింగ్ మాల్స్‌లో, పార్కుల్లో తిరుగుతుంటాడు. అతడు తిరిగిన ప్రాంతాల్లో ఒక్క మనిషి కూడా కనిపించడు. రోడ్డుపక్కన పార్క్ చేసిన వాహనాలు, ఖాళీగా రోడ్లు, మనుషులు లేని షాపింగ్ మాల్స్ లను ఈ వీడియోలో చూడొచ్చు.

Read More : Moon Tourism : హలో వస్తారా..చందమామపైకి టూర్..5 కంపెనీలతో నాసా ఒప్పందం

సినిమాను తలపించేదిగా ఉన్న 40 నిమిషాల ఈ వీడియోను టిక్ టాక్ స్టార్ జేవియ‌ర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసి తాను గ‌తంలోకి, భ‌విష్య‌త్తులోకి వెళ్లి వ‌స్తుంటాన‌ని చెబుతున్నాడు. అంతేకాదు ఈ మ‌ధ్యే తాను 2027లోకి వెళ్లి వ‌చ్చాన‌నీ చెబుతూ.. కావాలంటే ఈ వీడియో చూడండి.. ఇది 2027లోకి వెళ్లిన‌ప్పుడు తీశాను.

అప్పుడు రోడ్ల మీద‌, షాపింగ్ మాల్స్‌లో, పార్కుల్లో ఎవ‌రూ లేరు. ఒక్క వీడియో తీస్తున్న నేను త‌ప్ప అని తెలిపాడు. ఇప్ప‌టి నుంచి కేవ‌లం ఆరేళ్ల‌లోనే భూమి మీది నుంచి మ‌నుషులంతా మాయ‌మైపోతార‌ని జేవియ‌ర్ చెప్పాడు. అయితే ఇది ఎడిటింగ్ వీడియో అంటూ కొందరు కొట్టిపడేస్తున్నారు. మనుషులు లేని సమయంలో వీడియో తీసి వాటిని జతచేసి ఇలా ఇలా చేసి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇతినికి టిక్‌టాక్‌లో ఏకంగా 10 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.