Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

దేశంలొ తొలిసారిగా డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి.

Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

Omicron (2)

1270 Omicron cases in india : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ భారత్ లో కలకలం సృష్టిస్తోంది. దేశంలో కొత్త వేరియంట్ జెట్ స్పీడ్ తో వ్యాపిస్తోంది. రోజు రోజుకూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌ ఎంట్రీ తర్వాత భారత్‌లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు కేసులతో మొదలైన ఒమిక్రాన్‌ ప్రవాహం ఇప్పుడు ఏకంగా వెయ్యి మార్కును దాటేసింది. దేశంలొ తొలిసారిగా డిసెంబర్‌ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడగా..ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు 1,270కి చేరాయి. అంటే ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చిన నెలరోజుల్లోపే కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది.

రెండు కేసుల నుంచి 500 కేసుల రీచ్‌ అవ్వడానికి 25 రోజుల సమయం పడితే.. 500 కేసుల నుంచి వెయ్యి కేసులు రీచ్‌ అవ్వడానికి నాలుగంటే నాలుగు రోజులే పట్టిందంటే ఒమిక్రాన్‌ ఎలా గేర్లు మార్చిందో అర్థంఅవుతోంది. డిసెంబర్‌ 2న రెండు కేసులు, డిసెంబర్ 14న 50 ఒమిక్రాన్ కేసులు, డిసెంబర్ 17 నాటికి కేసుల సంఖ్య 100కి చేరింది. ఆ తర్వాత డిసెంబర్‌ 27 నాటికి ఆ సంఖ్య 500కు చేరగా.. ఇప్పుడా సంఖ్య 12వందలు దాటింది. ఇక ఈ 8 రోజుల్లోనే ఒమిక్రాన్ సంఖ్య 5 రెట్లు వేగంగా పెరిగింది.

Corona India : భారత్ లో కరోనా కల్లోలం…ఒక్కరోజే 16,500లకుపైగా పాజిటివ్ కేసులు

మరోవైపు ఒమిక్రాన్‌ వేరియంట్ దెబ్బకు కరోనా కేసులు జెట్ స్పీడ్‌తో దుసుకుపోతున్నాయి. ముందు రోజుకు దాన్ని తర్వాతి రోజుకు అసలు సంబంధమే లేనట్లుగా కేసుల ఉధృతి కొనసాగుతోంది. 24గంటల్లో భారత్‌లో 16 వేల 500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇది అంతకముందు రోజు కంటే 27శాతం ఎక్కువ. ఈ మూడు రోజుల్లోనే కరోనా కేసుల 2.6శాతం మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మొన్న 9 వేల కేసులు, నిన్న 13 వేల కేసులు, ఇవాళ 16 వేల కేసులు… ఇలా రోజురోజుకు కరోనా వేగం పెంచుకుంటుపోతోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారంలోనే కరోనా పీక్‌ స్టేజ్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

మెట్రో నగరాలపై కరోనా పంజా విసిరింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత దేశంలోని ఐదు మెట్రో నగరాల్లో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కోల్‌కతాలో ఐతే అంతకముందు రోజుతో పోల్చితే 102శాతం మేర కేసులు రికార్డయ్యాయి. నిన్న 540 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ ఆ సంఖ్య దాదాపు 11వందలకు చేరింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఒమిక్రాన్‌ కేసుల కట్టడికి కీలక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి కోల్‌కతాకు వచ్చే విమానాలపై సస్పెండ్ విధించింది. అటు ఢిల్లీలో 24గంటల్లో 13వందల కరోనా కేసులు రికార్డయ్యాయి. ఏడు నెలల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి మార్కును దాటింది. మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి.

Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్‌ ట్యాబ్లెట్స్‌ మార్కెట్లోకి విడుదల

ముంబైలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ముంబైలోనే 3వేల 6వందలకు పైగా కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇది ముందురోజుతో పోల్చితే 47శాతం ఎక్కువ. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు బృహన్‌ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ చర్యలు చేపట్టింది. వార్డు-స్థాయి వార్ రూమ్‌లను తిరిగి యాక్టివ్ చేసింది. ముంబైలో ఇప్పటికే న్యూయిర్‌ వేడుకలపై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిషేధం విధించింది.