Crime news: రాజస్థాన్‌లో దారుణం.. 13 ఏండ్ల బాలికపై..

దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు ఎక్కడోచోట చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా...

Crime news: రాజస్థాన్‌లో దారుణం.. 13 ఏండ్ల బాలికపై..

Crime News (1)

Crime news: దేశంలో మహిళలు, చిన్నారులపై హత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రోజుకు ఎక్కడోచోట చిన్నారులపై కామాంధులు అకృత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాలు వీటి నివారణకు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆదివారం అర్థరాత్రి 13ఏళ్ల బాలిక బహిర్భూమికి వెళ్లగా.. బాలికను కిడ్నాప్ చేసి కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాలిక ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. నిదితుడు మ‌నీష్ కుమార్‌గా గుర్తించిన బాలికల తండ్రి.. వెంటనే మనీష్ కుమార్ ను పట్టుకొనేందుకు ఇంటికి వెళ్లగా అప్పటికే నిందితుడు పరారయ్యాడు. నింధితుడి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా, ఎక్కడికో వెళ్లిపోయాడని తెలిపినట్లు బాలిక తండ్రి పేర్కొన్నాడు.

Crime News: పెళ్లయిన కొద్దిరోజులకే ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య.. ఎలా దొరికారంటే..

ఘటనపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం బాలికకు వైద్య పరీక్షలకోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోలీస్ స్టేషన్ లోనే సజీవ దహనానికి పాల్పడతామని బాధితురాలి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. అయితే పోలీస్ అధికారి అజయ్ శర్మ బాలిక కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బాలికపై హత్యాచారంకు పాల్పడిన మనీష్ కుమార్ కు నలుగురు పిల్లలు.