people trapped in streams : రెండు వాగుల్లో చిక్కుకుపోయిన 37 మంది.. వాగు మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో తలదాచుకున్న మహిళా కూలీలు, గొర్రెల కాపరులు

జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జి.కొత్తపల్లిలోని పాలేరు వాగు మధ్యలో 23 మంది కూలీలు చిక్కుకుపోయారు.

people trapped in streams : రెండు వాగుల్లో చిక్కుకుపోయిన 37 మంది.. వాగు మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో తలదాచుకున్న మహిళా కూలీలు, గొర్రెల కాపరులు

Vagu

people trapped in streams : తెలంగాణలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలో కురిసిన వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. లింగాలఘనపురం మండలంలోని చీటూరులో వాగులో 14 మహిళా కూలీలు, గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. వాగుల మధ్యలో ఉన్న శ్మశాన వాటికలో వారంతా తలదాచుకున్నారు. ఉదయాన్నే వారంతా వ్యవసాయ పనులకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి భారీ వర్షం కారణంగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారంతా వాగు మధ్యలోనే నిలిచిపోయారు.

సూర్యాపేట జిల్లాలోనూ భారీ వర్షం కురుస్తున్నాయి. దీంతో మద్దిరాల మండలం జి.కొత్తపల్లిలోని పాలేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లిన 23 మంది కూలీలు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. వారంతా మహబూబాబాద్ జిల్లా తానంచర్లకు చెందిన వారుగా గ్రామస్తులు చెప్తున్నారు. ఉదయాన్నే వ్యవసాయ పనుకులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో వాగులో వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారు వాగులోనే నిలిచిపోయారు.

Heavy Rains : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు..నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్

నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో భారీగా వానలు పడుతున్నాయి. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో పలు కాలనీలు నీట మునిగాయి. ఎల్బీనగర్‌ నుంచి శేరిలింగంపల్లి వరకు రహదారులు చెరువులను తలపించాయి. నిజాంపేట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో వాన బీభత్సం సృష్టించింది. నిజాంపేట బండారి లేఅవుట్‌, బృందావన్‌కాలనీ, బాలాజీనగర్‌, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్‌గాంధీనగర్‌, జయదీపికా ఎస్టేట్‌ తదితర ప్రాంతాల్లో నాలాలు లేకపోవడంతో రోడ్లపై నడుము లోతున వరద నీరు నిలిచింది.