Indore fire incident: మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్లో రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి...
Indore fire incident: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోర్లో రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గాఢ నిద్రలో ఉన్న ఏడుగురు సజీవదహనమయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదందాటికి అక్కడున్న వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో పలువురికి గాయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Madhya Pradesh | Five people charred to death after a fire broke out in a two-storey building in Indore.
The Fire official says, "The fire might have started through a short circuit. It took us 3 hours to bring the fire under control. pic.twitter.com/FNDeDWgm1x
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 7, 2022
మధ్యప్రదేశ్ ఇండోర్లోని విజయనగర్ ప్రాంతం స్వర్న్బాగ్ కాలనీలోని రెండంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం ఇషాక్ పటేల్ ఇల్లు అని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్నవారే. శనివారం తెల్లవారు జామున 3గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగిన వెంటనే పెద్ద శబ్దాలు, కేకలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు గాఢనిద్రలో ఉండగానే మంటల్లో సజీవదహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిని ఆశిష్, ఆకాంక్ష, గౌరవ్, నీతు సిపోడియాగా గుర్తించగా, మిగిలిన వారు ఎవరనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గాయపడ్డ వారిలో ఫిరోజ్, మునీరా, విశాల్, హర్షద్, సోనాలీలు ఉన్నారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
इंदौर में आग लगने की घटना में मौत की खबर अत्यंत ह्रदय विदारक है। मैंने इसके जांच के आदेश दे दिए हैं। जिसकी भी लापरवाही सामने आएगी, उसके विरुद्ध कड़ी कार्रवाई की जाएगी। मृतकों के परिजनों को 4-4 लाख रुपए दिए जाएंगे। https://t.co/zrgk7dyVpu
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 7, 2022
అగ్నిప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ చౌహాన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాగ్కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. వారి అకాల మృతికి చింతస్తూ, వారి ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకున్నారు. మృతుల కుటుంబాలకు ఈ విషాద ఘటనను జీర్ణించుకొనే శక్తిని ప్రసాదించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు సీఎం శివరాజ్ చౌహాన్ ట్వీట్ చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై సీఎం విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబీకులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలు అందజేస్తామని సీఎం శివరాజ్ చౌహాన్ తెలిపారు.