Himachal Pradesh : పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు..ఏడుగురు దుర్మరణం..
హిమాచల్ప్రదేశ్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Blasting fireworks factory In Himachal Pradesh..: హిమాచల్ప్రదేశ్లోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలోని ఉనా జిల్లాలోని తహ్లివల్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా..మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
ఈ ప్రమాదంలో గాయపడిన 12 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాగా ఈ పేలుళ్లపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తలించారు.
కాగా..ఉత్తరాఖండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. చంపావత్ జిల్లా సుఖిదాంగ్-దాందమినార్ రహదారిపై ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో వ్యక్తి గాయపడ్డారని, వారిని చంపావత్ జిల్లా దవాఖానకు తరలించామని చెప్పారు.