Allu Arjun: సందీప్ రెడ్డి సినిమా కోసం అల్లు అర్జున్ అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’లో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తనదైన మార్క్తో తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తి కాకముందే బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ను ఇటీవల అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డి వంటి కల్ట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని చేసేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాలో బన్నీ పాత్ర అల్టిమేట్గా ఉండబోతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
కాగా, ఈ సినిమా కోసం బన్నీ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.125 కోట్ల భారీ మొత్తంలో రెమ్యునరేషన్ను బన్నీ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్తతో ఒక్కసారిగా బన్నీ ట్రెండింగ్లోకి వచ్చాడు. ఒకవేళ ఇదే నిజమైతే, బన్నీ ‘బాహుబలి’ని మించిపోయినట్లే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. దీంతో ఇప్పుడు బన్నీ ప్రభాస్ను మించిపోయాడనే టాక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.