Arvind Kejriwal: కాశ్మీర్‌పై రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసు: అరవింద్ కేజ్రీవాల్

‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది.

Arvind Kejriwal: కాశ్మీర్‌పై రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసు: అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal: కాశ్మీర్‌లో నెలకొన్న సంక్షోభాన్ని నివారించడం బీజేపీ వల్ల కాదని, కేవలం కాశ్మీర్‌పై రాజకీయం చేయడం మాత్రమే ఆ పార్టీకి తెలుసని విమర్శించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కాశ్మీర్‌లో పండిట్లపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు.

Nayan-Vignesh : నయన్, విగ్నేష్ పెళ్లి.. తమిళనాడు సీఎంకి ప్రత్యేక ఆహ్వానం అందించిన జంట..

‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. ఈ అంశాన్ని పరిష్కరించడం బీజేపీకి చేతకాదు. దీనిపై రాజకీయం చేయడమే వారికి తెలుసు. కాశ్మీరీ పండిట్ల ఆందోళనను పట్టించుకోండి. వాళ్లకేం కావాలో తెలుసుకోండి. కాశ్మీర్ లోయలో వాళ్లకు భద్రత కల్పించండి. బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశ్మీరీ పండిట్లు హత్యకు గురవుతున్నారు. వాళ్ల ఓట్ల వల్లే లబ్ధి పొంది.. ఇప్పుడు వాళ్లనే పట్టించుకోకుండా వదిలేసింది ఆ పార్టీ. పండిట్లు వాళ్ల రక్షణ కోసం కచ్చితమైన యాక్షన్ ప్లాన్ కోరుకుంటున్నారు. అలాగే పాకిస్తాన్‌కు మళ్లీ చెబుతున్నా… కాశ్మీర్ మాది. ఎప్పటికీ మాదే’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Ganta Srinivasa Rao: ప్రభుత్వ చేతకానితనంతోనే పరీక్షా ఫలితాల విడుదల వాయిదా: గంటా శ్రీనివాసరావు

మరోవైపు ‘దేశభక్తి బడ్జెట్’ కింద ఢిల్లీలో 500 జాతీయ జెండాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. తిరంగ సమ్మాన్ సమితి ఆధ్వర్యంలో వీటిని ఏర్పాటు చేస్తామని, ఈ సమితి ఆధ్వర్యంలో వేలాది మందితో కమిటీ ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.