Raja Singh On TRS : ఎన్ని కేసులు వేసినా నన్ను ఓడించలేకపోయారు-రాజాసింగ్

బీజేపీని ఖతం చేయాలని సీఎం కేసీఆర్ నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. అంత చేసినా తననే గెలిపించారని చెప్పారు.

Raja Singh On TRS : ఎన్ని కేసులు వేసినా నన్ను ఓడించలేకపోయారు-రాజాసింగ్

Raja Singh

Raja Singh On TRS : హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2018 ఎన్నికల్లో పలువురు వేసిన కోర్టు కేసుల కొట్టివేతపై సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలు ఇంత నీచానికి దిగజారారు అని మండిపడ్డారు. 2018లో ఓట్ల కోసం డబ్బులు పెట్టి గెలిచారని ఆరోపించారు. అంత చేసినా తనను 2014, 2018 లో గెలిపించారని చెప్పారు.

TS BJP : ‘దేశంలో పీపుల్స్ ఫ్రంటూ లేదు ఏ టెంటూ లేదు’..ఇంజన్ లేని సర్కార్ ఉన్నా..లేకున్నా ఒక్కటే : బండి సెటైర్లు

సీఎం కేసీఆర్ బీజేపీని ఖతం చేయాలని నా మీద కేసు వేయించారని రాజాసింగ్ అన్నారు. 2019లో కేసు వేయించారని చెప్పారు. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్నీ వివరాలు ఇచ్చాను అన్నారు. నాపై మొత్తం 47 కేసులు ఉన్నట్లు తేలిందని, ఎన్నికల అఫిడవిట్ లో పెట్టాము అని చెప్పారు. కానీ, మరో 4 కేసుల వివరాలు ఇవ్వలేదని నాపై కోర్టులో కేసు వేశారని చెప్పారు. నిజానికి వాటి గురించి కూడా నాకు తెలియదన్నారు. వాటిలో కనీసం నా సంతకం కూడా లేదన్నారు.

Telangana High Court : బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఈ కేసు దాదాపు మూడేళ్లు సాగిందన్నారు. ఈ కేసు గెలవాలని బండి సంజయ్ మంచి లీగల్ టీంను అందించారని తెలిపారు. తనపై సంబంధం లేని కేసులు దాదాపు 17 కేసులు నడుస్తున్నాయని రాజాసింగ్ చెప్పారు. నా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా కేసులు పెడతారని రాజాసింగ్ అన్నారు. ఒక్కో స్టేషన్ లో 3, 4 కేసులు పెట్టారని చెప్పారు. ధర్మమే నన్ను కాపాడిందని రాజాసింగ్ అన్నారు.