bjp: అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలి: బండి సంజయ్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించట్లేదని అన్నారు. తెలంగాణలో నీతివంతమైన పాలన రావాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు సహకరించట్లేదని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలని ఆయన అన్నారు.
bjp: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ తీరు చూస్తుంటే బాధగా ఉందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీపై టీఆర్ఎస్ నేతలు ఎందుకు అంతగా విమర్శలు చేస్తున్నారో చెప్పాలని ఆయన నిలదీశారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగించారు. దేశ వ్యాప్తంగా ఉచితంగా కరోనా టీకాలు ఇచ్చినందుకు తిడుతున్నారా అని ప్రశ్నించారు. లేదంటే పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకు తిడుతున్నారా అని నిలదీశారు. యుద్ధం కారణంగా యుక్రెయిన్లో చిక్కుకుపోయిన విద్యార్థులను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా భారత్కు తీసుకువచ్చిందని ఆయన అన్నారు.
Maharashtra: నన్ను సీఎంను చేసి మోదీ, షా అందరి కళ్ళూ తెరిపించారు: ఏక్నాథ్ షిండే
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెప్పారు. వాటిని తెలంగాణ ప్రభుత్వం సక్రమంగా వినియోగించట్లేదని అన్నారు. తెలంగాణలో నీతివంతమైన పాలన రావాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధికి టీఆర్ఎస్ సర్కారు సహకరించట్లేదని ఆయన చెప్పారు. అందుకే తెలంగాణలో బీజేపీ సర్కారు రావాలని ఆయన అన్నారు.
bjp: తెలంగాణలో అరాచక పాలన.. ఇక్కడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: యోగి, పీయూష్
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మరో రెండు దశాబ్దాల పాటు ఉంటుందని ఆయన చెప్పారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వచ్చేలా ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదని ఆయన ప్రశంసించారు. కాగా, పరేడ్ గ్రౌండ్ సభలో బండి సంజయ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భుజం తట్టి అభినందించారు.