TDP Chandrababu : టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు

తెలుగుదేశం పార్టీని తెలుగు వారిని ఎవ్వరు విడదీయలేరని పేర్కొన్నారు. తెలుగు కీర్తిని వ్యాపింప చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు.

TDP Chandrababu : టీడీపీ స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు

Chandrababu

TDP Chandrababu : తెలుగుదేశం పార్టీని స్థాపించిన స్థలంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ వెళ్లారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 40 సంవత్సరాలు క్రితం చరిత్ర సృష్టించిన రోజు ఈ రోజు అన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించి మహానుభావుడు ఎన్టీఆర్ కొనియాడారు. 40 సంవత్సరాలు క్రితం ఇదే రోజు ఇదే స్థలంలో పార్టీని ప్రకటించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత అని లికించబడి ఉంటుందన్నారు. 40 సంవత్సరాలు ఎన్నో రీకార్డ్స్ సృష్టించామని తెలిపారు. యువత ముందుకు రావాలని పిలుపిచ్చారు.

TDP @ 40 Years : టీడీపీ ఆవిర్భావానికి ముందు, తర్వాత అని చరిత్ర చదవాలి-చంద్రబాబు నాయుడు

తెలుగుదేశం పార్టీని తెలుగు వారిని ఎవ్వరు విడదీయలేరని పేర్కొన్నారు. తెలుగు కీర్తిని వ్యాపింప చేసిన వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు0 ఇరు రాష్ట్రాలకు సంబంధించిన టీడీపీ నేతలు నివాళులర్పించారు.

తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటికి 40 ఏళ్ళు పూర్తైంది. 40 ఏళ్ల క్రితం ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎన్టీఆర్ పార్టీని ప్రకటించారు. మార్చ్ 29 న 1982లో ఇదే రోజు ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రకటించారు.