Bandi Sanjay : జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా మోసగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం : బండి సంజయ్

పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Bandi Sanjay : జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా మోసగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం : బండి సంజయ్

Bandi Sanjay (3)

Bandi Sanjay : జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్)లను  సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కష్టపడి పరీక్ష రాసి సెలెక్టై ఉద్యోగాల్లో చేరిన జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. నిజానికి ఏ ఉద్యోగానికైనా రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటే వీరికి మాత్రం మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ గా నిర్ణయించారని పేర్కొన్నారు. ఆ తరువాత మరో ఏడాది ప్రొబేషనరీ పీరియడ్ పెంచారని చెప్పారు. అయినప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అన్నింటినీ భరించి 4 ఏళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసిన తరువాత కూడా రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం అన్నారు.

పోలీసులను, అధికారులను జేపీఎస్ ల ఇళ్లకు పంపి సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్ట్ చేస్తామని, జైళ్లకు పంపుతామంటూ ప్రభుత్వం బెదిరిస్తోందన్నారు. ఈ సమయంలో జేపీఎస్ లకు పూర్తిస్తాయిలో అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈరోజు గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే.. గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చాయంటే దానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులే కారణమని వెల్లడించారు. అయినా వీరిపై ప్రభుత్వం కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఈ రోజు సాయంత్రంలోపు విధుల్లో చేరకుంటే సమ్మె చేస్తున్న జేపీఎస్ లను తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించిందని పేర్కొన్నారు.

Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్

జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు(జేపీఎస్)లకు అండగా నిలవాలని, వారి ఇళ్ల వద్దకు వెళ్లి సంఘీభావం తెలపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జేపీఎస్ ల పక్షాన ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మిగిలిన ఉద్యోగులనూ వారికి మద్దతు తెలిపేలా కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, కో కన్వీనర్లతో బండి సంజయ్ టెలికాన్ఫ్ రెన్స్ నిర్వహించారు.

మే11న సంగారెడ్డి ‘‘నిరుద్యోగ మార్చ్’’ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. మే14న కనీవినీ ఎరగని రీతిలో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని తెలంగాణలో హిందూ సంఘటిత శక్తిని చాటుదామని వెల్లడించారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నారని చెప్పారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె పూర్తిగా న్యాయమైనదేనని స్పష్టం చేశారు.

Karnataka Elections 2023 : రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

జేపీఎస్ ల డిమాండ్లకు పూర్తిగా బీజేపీ మద్దతిస్తోందని చెప్పారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో జేపీఎస్ ల సమ్మెలో పాల్గొని స్వయంగా సంఘీభావం తెలిపానని తెలిపారు. వారిని తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ సీఎంకు లేఖ రాశానని గుర్తుల చేశారు. అయినా కేసీఆర్ ప్రభుత్వం పెడచెవిన పెట్టడమే కాకుండా వారిని తొలగించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలందరూ జేపీఎస్ ల ఇళ్లకు వెళ్లాలని వారి సమ్మెకు సంఘీభావం తెలపాలని సూచించారు. ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదని.. అండగా బీజేపీ ఉందనే సంకేతాలను పంపాలని తెలిపారు.

అందులో భాగంగానే జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పక్షాన ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తామంటూ కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత హిందూ ధర్మరక్షకులంతా ఏకమవుతున్నారని వెల్లడించారు. తెలంగాణలోనూ హిందువుల సత్తా తెలిపేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందూత్వ వాతావరణం వెల్లివిరిసేలా ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను నిర్వహించబోతున్నామని తెలిపారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో ముగ్గురు అరెస్టు

దాదాపు లక్ష మందికిపైగా ఈ యాత్రకు హాజరయ్యే అవకాశముందన్నారు. రాజకీయాలకతీతంగా పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీల్లేకుండా హిందూ ఏక్తా యాత్ర పేరుతో నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ కూడా హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్తతోపాటు, హిందూ ధర్మ రక్షకులంతా ఈ యాత్రలో పాల్గొని హిందూ సంఘటిత శక్తిని చాటాలని కోరుతున్నట్లు చెప్పారు.