CM KCR New Secretariat : నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. వేగంగా పూర్తి చేయాలని ఆదేశం

తెలంగాణ నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

CM KCR New Secretariat : నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. వేగంగా పూర్తి చేయాలని ఆదేశం

cm kcr

CM KCR New Secretariat : తెలంగాణ నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. సచివాలయ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోర్టికో నుంచి నడుచుకుంటూ ప్రతి ఫ్లోర్ లో పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు.  ఆరో అంతస్తులోని సీఎం పేషీ ఫ్లోర్ పనులను కేసీఆర్ పర్వవేక్షించారు.

అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆధికారులను ఆదేశించారు. 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్ కు చెప్పారు. సెక్రటేరియట్ లోని ఆరు ఫ్లోర్లను సీఎం కేసీఆర్ కాలి నడకనే తిరిగి నిర్మాణం పనులను పరిశీలించారు. నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

Telangana New Secretariat: తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేలా నూతన సచివాలయం.. ఆర్కిటెక్ట్‌లు ఏం చెప్పారంటే ..

అనంతరం మెయిన్ గేట్ బయటి వరకు కూడా సీఎం కేసీఆర్ నడుచుకుంటూ వచ్చారు.అనంతరం అంబేద్కర్ విగ్రహ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొదట నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. దాదాపు రెండు గంటలకుపై సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అంబేదర్కర్ విగ్రహం వద్దకు వచ్చారు.  ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అంబేద్కర్ జయంతి రోజు విగ్రహ ఆవిష్కరణ ఉండనుంది.  అలాగే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి విగ్రహానికి సంబంధించిన మిగిలిన నిర్మాణం పనులను చాలా వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఇక్కడకు వచ్చి విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ మేరరకు సీఎం అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు.