Road Accident: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Road Accident: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత కుమార్తె మృతి

Road Accdient

Road Accident: శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి అపర్ణా సర్కిల్ వద్ద ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Hyderabad: స్థల వివాదం విషయంలో ఇస్మాయిల్‌పై కాల్పులు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు..

ఎయిర్ పోర్టు నుంచి తిరిగి వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో తనియా మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటీన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తనియా బ్యూటీషియన్ గా పనిచేస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Chikoti Praveen: నేడు ఈడీ ముందుకు చీకోటి ప్రవీణ్ గ్యాంగ్.. కీలక వివరాలు సేకరించనున్న అధికారులు

ఇదిలాఉంటే శంషాబాద్ లో జరిగిన ఓ పార్టీకి హాజరై తిరిగి ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగానికి ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్.