Bollywood : కరణ్ జోహార్ పార్టీతో బాలీవుడ్‌లో కరోనా కలకలం

కరణ్‌ జోహర్‌ ఇటీవల తన ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ కి డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలోనే బాలీవుడ్ కు కరోనా విస్తరించింది అని తేలింది. కరణ్ జోహార్ ఇంట్లో పార్టీకి హాజరైన నలుగురు....

Bollywood : కరణ్ జోహార్ పార్టీతో బాలీవుడ్‌లో కరోనా కలకలం

Bollywood

Bollywood :  గతంలో కరోనా మొదటి వేవ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. తెలుగు, తమిళ్, హిందీ.. ఇలా అన్ని భాషల సినీ పరిశ్రమలలో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. స్టార్లు సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. కొంతమంది ఆర్టిస్టులు కరోనాతో మరణించారు కూడా. అయితే ఇటీవల మళ్ళీ కరోనా విజృభిస్తుండటంతో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది సెలబ్రిటీలు మళ్ళీ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కమల్ హాసన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న సీనియర్ హీరో అర్జున్ కూడా కరోనా బారిన పడ్డారు. మొన్న బాలీవుడ్ హీరోయిన్స్ కరీనా కపూర్, అమృత అరోరాలకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే వీళ్ళిద్దరికీ పాజిటివ్ అని తెలియడంతో బాలీవుడ్ లో కలకలం రేగింది.

బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ ఇటీవల కే3జీ(K3G) సినిమాకు 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన ఇంట్లో బాలీవుడ్ స్టార్స్ కి డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీలోనే బాలీవుడ్ కు కరోనా విస్తరించింది అని తేలింది. కరణ్ జోహార్ ఇంట్లో పార్టీకి హాజరైన నలుగురు సెలబ్రిటీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో బాలీవుడ్ అప్రమత్తమైంది. పార్టీ అయిన తెల్లారే నటుడు సౌహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇదే పార్టీకి హాజరైన కరీనా కపూర్‌ఖాన్‌, అమృతా అరోరా కూడా పరీక్షలు చేయించుకోగా వారికి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది.

PV Narasimharao : హాఫ్ లయన్.. పీవీ నరసింహారావుపై వెబ్ సిరీస్.. ‘ఆహా’లో

దీంతో ఈ పార్టీ కి వచ్చిన వాళ్లంతా కరోనా పరీక్షలు చేయించుకోగా సంజయ్‌ కపూర్ భార్య మహీప్‌ కపూర్‌ కి కూడా కరోనా అని తేలింది. ఈ పార్టీకి ఆలియా భట్‌, కరిష్మా కపూర్‌, మలైకా అరోరా, అర్జున్‌కపూర్‌, డిజైనర్ మసాబా గుప్తా లాంటి స్టార్స్ చాలా మంది ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాక ఈ పార్టీ జరిగిన మరుసటి రోజే కరీనా కపూర్‌, అమృత అరోరా.. అనిల్ కపూర్ పెద్దకూతురు రియా కపూర్‌ ఇంట్లో క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. దీంతో రియా పార్టీకి వచ్చిన సెలబ్రిటీలు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పార్టీలకు వచ్చిన స్టార్లంతా ఇప్పుడు ఐసోలేషన్ లో ఉన్నారు.

ఇక బాలీవుడ్‌ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ఇలా కరోనా బారిన పడుతుండటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎవరెవరూ క్లోజ్‌గా కాంటాక్ట్ అయ్యారో వారందరిని వెంటనే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. అలాగే కరణ్ జోహార్‌, కరీనా కపూర్‌, అమృతా అరోరా నివాసాలను బీఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వాటిని కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించారు. మొత్తానికి బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీ ఇప్పుడు అందర్నీ భయంలోకి నెట్టేసింది. ఈ స్టార్ల అభిమానులు వీళ్లంతా త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.