Electric Bike Explosion: అర్ధరాత్రి పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఇంటికి అంటుకున్న మంటలు

ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి.

Electric Bike Explosion: అర్ధరాత్రి పేలిన ఎలక్ట్రిక్ బైక్.. ఇంటికి అంటుకున్న మంటలు

Bike

Electric Bike Explosion: ఎలక్ట్రిక్ బైక్‌ల పేలుడు ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇంటిముందు చార్జింగ్ పెట్టి ఉంచిన ఎలక్ట్రిక్ బైక్ అర్ధరాత్రి సమయంలో పేలింది. దీంతో బైక్ మంటల్లో దగ్దం అవ్వటంతో పాటు ఇంటికి మంటలు వ్యాపించాయి. బైక్ పేలుడు సమయంలో భారీ శబ్దం రాడంతో ఇంటిలో నిద్రిస్తున్న వారు లేచి చూడగా ఇంటికి మంటలు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే పెంకుటిళ్లు కావడంతో పెద్దగా మంటలు వ్యాప్తిచెందక పోవటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పెద్దచీకోడు గ్రామంలో చోటు చేసుకుంది.

Electric Bike Explodes : బాంబులా పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

పెట్రోల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు సొంత వాహనంపై బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లు అందుబాటులోకి రావడంతో వాటిని కొనుగోలుకు మొగ్గుచూపారు. అనేక మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే ఇటీవల బైక్‌లు వరుసగా పేలుతుండటంతో ఎలక్ట్రిక్ బైక్ అంటేనే వాహన దారులు బెంబేలెత్తిపోతున్నారు. బైక్ పేలిన ఘటనలో పలువురు మృతిచెందిన ఘటనలుసైతం ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పేలాయి. తాజాగా పెద్దచీకోడులో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి కొద్దిరోజుల కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు.

Electric Bike Catches Fire : వామ్మో ఎలక్ట్రిక్ బైక్.. నడుపుతుండగా సీటు కింద నుంచి ఒక్కసారిగా మంటలు

మంగళవారం రాత్రి సమయంలో ఇంటి ఆవరణంలో బైక్‌కు చార్జింగ్ పెట్టి నిద్రపోయాడు. చార్జింగ్ ఫుల్ కావటంతో అర్దరాత్రి సమయంలో బైక్ ఒక్కసారిగా పేలింది. పెద్దశబ్దం రావడంతో ఇంట్లోని సభ్యులు బయటకు వచ్చారు. అప్పటికే ఇంటికి మంటలు వ్యాపిస్తుండటంతో వాటికి నీళ్లుచల్లి ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరలు పెరుగుదలతో ఎలక్ట్రిక్ బైక్ ను కొన్నానని, ఇప్పుడు నిలువనీడ లేకుండా కోల్పాయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.