Puneeth Rajkumar: పునీత్‌కి మరణం లేదు.. నన్ను మామ అని పిలిచేవాడు

భారతీయ సినీసమాజం ఓ మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు నందమూరి బాలకృష్ణ.

Puneeth Rajkumar: పునీత్‌కి మరణం లేదు.. నన్ను మామ అని పిలిచేవాడు

Balakrishna (1)

BalaKrishna:

భారతీయ సినీసమాజం ఓ మంచి నటుడిని కోల్పోయిందని అన్నారు నందమూరి బాలకృష్ణ. నిన్న, మొన్న వరకు మన ముందు ఉన్న మనిషి లేడంటే చాలా బాధగా అనిపిస్తుందని అన్నారు బాలయ్య. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కుటుంబంతో తనకు చాలా అనుబంధం ఉందని, ఆ కుటుంబంలో ఇటువంటి విషాదం చూస్తుంటే, దు:ఖంగా అనిపిస్తుందని అన్నారు.

పునీత్ రాజ్ కుమార్ మరణం కలచివేస్తుందని, నటుడిగా చేసిన సేవలు.. సమాజానికి పునీత్ చేసిన సేవలు శాశ్వితంగా గుర్తుండిపోతాయని అన్నారు. పుట్టినవాళ్లు గిట్టుతారని, కానీ పునీత్ లాంటి వారికి మరణం అనేదే ఉండదని అన్నారు. ఏదైనా తీరనిలోటు కన్నడ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు ఎవరూ తీర్చలేదని అన్నారు.

పునీత్ రాజ్‌కుమార్ ఆత్మశాంతించాలని, నమ్మలేని నిజాన్ని అభిమానులు కూడా జీర్ణించుకోవాలని అన్నారు. అభిమానులు మాత్రం పునీత్‌ని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారని అన్నారు. తనకు మాత్రం పర్సనల్‌గా మంచి వ్యక్తిని, కుటుంబ సభ్యున్ని కోల్పోయాననే భావన ఉందని అన్నారు బాలకృష్ణ.

పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఒంటరి అయినప్పటికీ అన్నదమ్ముల్లా మేమంతా అండగా ఉంటామని అన్నారు. పునీత్ కళను సామాజిక సేవకు ఉపయోగించాడని, తాను పిలవగానే లేపాక్షి ఉత్సవాలకు చాలాసార్లు వచ్చాడని, ఏ కార్యక్రమానికి ఆహ్వానం పలికినా వస్తారని అన్నారు.

Siddaramaiah:

ఇదే సమయంలో కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధి రామయ్య కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. “పునీత్ నన్ను మామా అని పిలిచేవాడని.. పునీత్ మరణం దేశానికి, కన్నడీగులకు తీరని బాధ కలిగించింది” అని సిద్ధరామయ్య అన్నారు.