Gopichand Malineni : బాలకృష్ణ అభిమానుల మీద లాఠీ ఛార్జ్.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ గోపీచంద్

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. సినిమా సెన్సార్ అయింది. వాళ్ళు కూడా సినిమా చాలా బాగా ఉంది అన్నారు. షూట్ షాట్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. మొన్న ఒంగోలులో జరిగిన ఈవెంట్ లో అక్కడ పోలీస్ లు 30వేలు పాసులు ఇచ్చారు, కానీ................

Gopichand Malineni : బాలకృష్ణ అభిమానుల మీద లాఠీ ఛార్జ్.. క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ గోపీచంద్

Gopichand Malineni says sorry to balakrishna fans

Gopichand Malineni :  బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోమవారం సాయంత్రం సినిమా నుంచి మాస్ మొగుడు అనే మరో సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఇటీవల వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో మాస్ మొగుడు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని దీనిపై స్పందించాడు.

Samantha : సమంత చేతిలో జపమాల.. మొన్న, ఇవ్వాళ కూడా.. ఎందుకో తెలుసా??

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. సినిమా సెన్సార్ అయింది. వాళ్ళు కూడా సినిమా చాలా బాగా ఉంది అన్నారు. షూట్ షాట్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. మొన్న ఒంగోలులో జరిగిన ఈవెంట్ లో అక్కడ పోలీస్ లు 30వేలు పాసులు ఇచ్చారు, కానీ బయట ఇంకా 50వేల మంది అభిమానులు ఉన్నారని, వాళ్ళు చాలా బాధ పడ్డారని తెలిసింది. కొంతమంది అభిమానుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను క్షమాపణలు చెప్తున్నాను అని అన్నాడు.