Telangana : ‘మీరు నశం పెడితే..మేం జండూ బామ్ రాస్తాం’..కేసీఆర్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..

తెలంగాణలో రాజకీయాల్లో ‘నశం వర్సెస్ జండూబామ్’. మిమ్మల్ని ‘నశం పెట్టి నలిపేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి.. బండిసంజయ్ ‘మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తామంటూ..కౌంటరిచ్చారు

Telangana : ‘మీరు నశం పెడితే..మేం జండూ బామ్ రాస్తాం’..కేసీఆర్ వ్యాఖ్యలకు బండి కౌంటర్..

Kcr Vs Bandi Sanjay

KCR vs Bandi Sanjay : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతునే ఉన్నాయి.ఈ క్రమంలో తెలంగాణలో రాజకీయాల్లో ‘నశం వర్సెస్ జండూబామ్’ అంటూ మాటల తూటాలు పేలుతున్నాయి. మిమ్మల్ని ‘నశం పెట్టి నలిపేస్తాం అని కేసీఆర్ వార్నింగ్ ఇస్తే దానికి తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ‘మీరు నశం పెడితే మేం జండూ బామ్ రాస్తాం’అంటూ కౌంటర్ ఇచ్చారు.బీజేపీతో పెట్టుకుంటే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. జనగామాలో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.దాడులు చేశారు.అయినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారని అందుకే బెదిరింపులకు దిగుతున్నారని..మీరు బెదిరిస్తే బెదిరేది లేదంటూ స్పష్టంచేశారు.

కాగా..జనగామ వేదికగా శుక్రవారం (ఫిబ్రవరి 11,2022) సీఎం కేసీఆర్ బీజేపీపై ఘాటు విమర్శలుచేశారు. తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం..అభివృద్ధి చేసుకుంటున్నాం..అటువంటి తెలంగాణాకు ఇవ్వాల్సిన నిధులు..విభజన హామీలు నెరవేర్చకపోగా..కక్ష సాధింపు చర్యలు దిగుతున్నారంటూ మండిపడ్డారు.

అంతేకాదు ఖబడ్దార్ నరేంద్ర మోదీ..బీజేపీ బిడ్డల్లారా తెలంగాణ జోకికొచ్చినా..తెలంగాణ బిడ్డల జోలికొస్తే మిమ్మల్ని ‘నశం చేస్తాం అంటూ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల బండి సంజయ్ అంతకంటే ఘాటుగా కేసీఆర్ కు కౌంటరిచ్చారు. కేసీఆర్ కు భయం పట్టుకుందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బండి ఎద్దేవా చేశారు. కచ్చితంగా కేసీఆర్ పాలనపై చర్చ జరుగుతుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ అదే సమయంలో తెలంగాణలోని బీజేపీ నేతలు, కార్యకర్తలకు కూడా వార్నింగ్‌ ఇచ్చారు.. పిడికెడు లేని బీజేపోడు టీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టాడని తెలిసింది. బీజేపీ బిడ్డల్లారా మేం మంచివాళ్లం మిమ్మల్ని ఏమీ అనం.. కానీ, మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.. మా శక్తి ముందర మీరు ఎంత? మేం ఊదితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్త అంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు సీఎం కేసీఆర్‌..

జనగామ వేదికగా ప్రధాని మోడీని టార్గెట్‌ చేశారు కేసీఆర్.. ఏ రాష్ట్రం పాల‌సీ ఆ రాష్ట్రానికి ఉండాల‌ని కేంద్రాన్ని ప‌లుమార్లు కోరానన్న ఆయన.. క‌రెంట్ సంస్కరణల పేరిట మోడీ కొత్త పంచాయతీ పెట్టారని మండిపడ్డారు.. ప్రతి మోటార్‌కు మీట‌ర్ పెట్టాల‌ని అంటే..పెట్టేది లేదంటారు. తెలంగాణకు ఇవ్వాల్సి ఇవ్వటంలేదని కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. మేం ట్యాక్సులు కడుతున్నాం.. మేం అడిగినా ఇవ్వడంలేదు.. అని మిమ్మల్ని దేశం నుంచి తరిమిస్తేం.. మాకు అన్నీ ఇచ్చేవారినే తెచ్చుకుంటామనంటూ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్.