Rahul Gandhi: మోదీ మరో ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు: రాహుల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారని చెప్పారు.
Rahul Gandhi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకుండా ప్రస్తుతం మోదీ మరో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో ప్రణాళికను సిద్ధం చేసుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారని చెప్పారు.
Maharashtra: పతనం అంచున ‘మహా’ సర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ
”అన్ని అంశాలనూ పక్కదారి పట్టించి మభ్యపెట్టడంలో మోదీ పండితుడు. అయితే, ఈ విపత్తులను మాత్రం ఆయన దాచిపెట్టలేరు. అవి ఏంటంటే… డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.78కి చేరింది. ఎల్ఐసీ మార్కెట్ విలువలో రూ.1.32 లక్షల కోట్లు నష్టపోయింది. హోల్సేల్ ద్రవ్యోల్బణం 30 ఏళ్ళ గరిష్ఠానికి చేరింది. నిరుద్యోగం జీవితకాల గరిష్ఠానికి చేరింది. దేశంలో ఎన్నడూ జరగనంత అతి పెద్ద బ్యాంకు కుంభకోణం డీహెచ్ఎఫ్ఎల్లో చోటుచేసుకుంది” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.