Tejashwi Yadav: అవ‌స‌ర‌మైతే లాలూను చికిత్స కోసం సింగ‌పూర్‌కు తీసుకెళ్తాం: తేజ‌స్వీ యాదవ్

మెట్లు ఎక్కుతూ కింద‌ప‌డిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. లాలూను  చూసేందుకు ఆసుప‌త్రికి వ‌చ్చిన ఆయ‌న కుమారుడు, ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నార‌ని ఆయ‌న చెప్పారు

Tejashwi Yadav: అవ‌స‌ర‌మైతే లాలూను చికిత్స కోసం సింగ‌పూర్‌కు తీసుకెళ్తాం: తేజ‌స్వీ యాదవ్

Tejaswi

Tejashwi Yadav: మెట్లు ఎక్కుతూ కింద‌ప‌డిన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. లాలూను  చూసేందుకు ఆసుప‌త్రికి వ‌చ్చిన ఆయ‌న కుమారుడు, ఆర్జేడీ నేత తేజ‌స్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. అవ‌స‌ర‌మైతే లాలూను చికిత్స కోసం సింగ‌పూర్‌కు తీసుకెళ్తామ‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఫోన్ చేసి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నార‌ని ఆయ‌న చెప్పారు.

Andhra Pradesh: మళ్ళీ అధికారంలోకి రావడానికి టీడీపీ ఇలా చేసింది: భూమ‌న‌

రాజ‌కీయాల‌కు అతీతంగా ప‌లువురు నేత‌లు లాలూ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం లాలూ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఆయ‌న‌కు కిడ్నీ, హృద్రోగాలు ఉన్న‌ట్లు ప్ర‌తి ఒక్క‌రికీ తెలుస‌ని తేజ‌స్వీ యాద‌వ్ వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు గ‌తంలో ఢిల్లీలో చికిత్స అందింద‌ని అన్నారు. ఢిల్లీలోని ఆ వైద్యుల‌కే లాలూ ఆరోగ్యం గురించి పూర్తిగా తెలుస‌ని తేజ‌స్వీ చెప్పారు. అందుకే తాము బిహార్ నుంచి ఆయ‌న‌ను చికిత్స కోసం ఢిల్లీకి త‌ర‌లిస్తున్నామ‌ని వివ‌రించారు.