Covid-19 : భారత్లో కొత్తగా 4,041 కోవిడ్ కేసులు నమోదు
దేశంలో నిన్న కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్కు గురైనవారి సంఖ్య4,31,68,585కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్1 తో పోలిస్తే నిన్న కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్య పెరగింది.
Covid-19 : దేశంలో నిన్న కొత్తగా 4,041 కొత్త కోవిడ్ కేసులునమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో కోవిడ్కు గురైనవారి సంఖ్య4,31,68,585కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జూన్1 తో పోలిస్తే నిన్న కొత్తగా 1,668 యాక్టివ్ కేసులు సంఖ్య పెరగింది.
నిన్న 10 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించారు. దీంతో మొత్తం covid మరణాల సంఖ్య 5,24,651 కి చేరింది. దేశంలో నిన్న 2,363 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. దీంతో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,26,22.757కి చేరింది. భారత్ లో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతం గా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉంది.
కోవిడ్ నిరోధానికి ప్రభుత్వం చేపట్టిన vaccination కార్యక్రమంలో భాగంగా నిన్న 12,05,840 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో 193,83,72,365 vaccine డోసులు అందించారు. దేశంలో గత వారం రోజుల్లో 21,055 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Also Read : Ban On Lockdown : లాక్డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం