COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు.. నిన్న 22,50,854 వ్యాక్సిన్ డోసుల వినియోగం

దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,38,35,852కు చేరిందని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 64,667గా ఉందని తెలిపింది.

COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు.. నిన్న 22,50,854 వ్యాక్సిన్ డోసుల వినియోగం

COVID 19

COVID-19: దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 10,828 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,38,35,852కు చేరిందని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని చెప్పింది. వారాంతపు పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 64,667గా ఉందని తెలిపింది.

ప్రస్తుతం రికవరీ రేటు 98.67 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో మొత్తం ఇప్పటివరకు 88.58 కోట్ల కరోనా పరీక్షలు చేశారని తెలిపింది. నిన్న 3,52,166 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. ఇప్పటివరకు దేశంలో 212.39 కోట్ల వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపింది. వాటిలో 94.24 కోట్ల రెండో డోసులు, 15.86 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నట్లు పేర్కొంది. నిన్న దేశంలో 22,50,854 వ్యాక్సిన్ డోసులు వేసినట్లు వివరించింది.

India exercising with Russia: రేపటి నుంచి రష్యా సైనిక విన్యాసాలు.. పాల్గొననున్న భారత్, ఇతర దేశాలు.. అమెరికా ఆందోళన