MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.

MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం అసాధ్యం.. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం సాధ్యం కాదని కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. 9న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

గురువారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులపై కవిత స్పందించారు. బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘తెలంగాణ తల వంచదు! రాజకీయ రంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు, మహిళా సంఘాలతో కలిసి ఈ నెల 10న భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒకరోజు దీక్ష చేయాలని నిర్ణయించాం.

International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

ఈ క్రమంలోనే 9న ఢిల్లీలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తా. అయితే, ధర్నా కార్యక్రమంతోపాటు, ఇతర ముందస్తు అపాయింట్‌మెంట్లు ఉన్న దృష్ట్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటా. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యల ద్వారా సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని లొంగదీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూనే ఉంటాం.

దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికార కాంక్షాపరులకు గుర్తుచేస్తున్నా. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం’’ అని కవిత తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో కవిత తన తండ్రి, సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించబోతున్నారు.