Labour codes: కార్మిక చట్టాల్లో మార్పులు.. జీతం తగ్గుతుంది, పీఎఫ్ పెరుగుతుంది
కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొత్త చట్టాలతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం తగ్గి.. పీఎఫ్ పెరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లు రాబోయే కొద్ది నెలల్లో అమలు అయ్యే అవకాశం ఉంది. ఈ కార్మిక చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Labour codes on Cards: కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధం అవుతోంది. కొత్త చట్టాలతో ఉద్యోగుల చేతికి వచ్చే జీతం తగ్గి.. పీఎఫ్ పెరుగుతుంది. నాలుగు లేబర్ కోడ్లు రాబోయే కొద్ది నెలల్లో అమలు అయ్యే అవకాశం ఉంది. ఈ కార్మిక చట్టాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కార్మిక చట్టాల అమలుతో ఉద్యోగుల చేతికి వచ్చే వేతనం తగ్గుతుంది. అలాగే, ఉద్యోగుల పీఎఫ్ ఫండ్కు కంపెనీలు ఎక్కువ సహకారం అందించాల్సి ఉంటుంది. ఈ చట్టాల అమలుతో, ఉద్యోగుల ప్రాథమిక జీతం, భత్యాలు మరియు పీఎఫ్కు సంబంధించి పెద్ద మార్పు ఉంటుంది.
ఈ నాలుగు కార్మిక చట్టాల్లో వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాలపై కోడ్, జాబ్ సెక్యురిటీ కోడ్, ఆరోగ్యం మరియు పని పరిస్థితులకు సంబంధించిన కోడ్(OSH) మరియు సామాజిక మరియు వృత్తి భద్రతా కోడ్ ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2021 నుంచి ఈ కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వశాఖ భావించింది. అయితే, కొత్త వేతన నియమావళి ప్రకారం.. యజమానులకు వారి ఉద్యోగుల వేతనాలను సమీక్షించడానికి ఎక్కువ సమయం ఇస్తూ, దీనిని వాయిదా పడింది.
ఈ నాలుగు కోడ్లు కింద మంత్రిత్వశాఖ నిబంధనలను ఖరారు చేసింది. అయితే, అనేక రాష్ట్రాలు తమ సొంత కోడ్లు అమల్లో ఉన్నందున ఈ నియమాలను అమలు చేసే స్థితిలో లేమని చెబుతున్నాయి. కేంద్రం మాత్రం భారత రాజ్యాంగం ప్రకారం శ్రమ అనేది ఏకకాలిక విషయం అని అంటుంది. అంటే కేంద్రం మరియు రాష్ట్రాలు ఈ నాలుగు కోడ్లు అమలు చెయ్యాల్సి ఉంటుంది. అప్పుడే ఈ చట్టాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభావవంతంగా ఉంటాయనేది కేంద్రం అభిప్రాయం.
కొత్త వేతన కోడ్ కింద అన్ని భత్యాలు మొత్తం వేతనంలో 50 శాతం మించకూడదు. దీనితో ఉద్యోగి ప్రాథమిక జీతం మొత్తం జీతంలో 50 శాతం ఉంటుంది. అదే సమయంలో, ఉద్యోగి మరియు సంస్థ రెండింటి పీఎఫ్ సహకారం పెరుగుతుంది. అదనంగా, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. దీని అర్థం ఉద్యోగి పొదుపు పెరుగుతుంది. అయితే, ఉద్యోగి చేతిలో జీతం మాత్రం తగ్గుతుంది.
ఇక ఓవర్ టైమ్ రూల్స్ కూడా మారనున్నట్లు తెలిసింది. కొత్త కార్మిక చట్టం ప్రకారం.. 15 నిమిషాలకు మించి అదనంగా పనిచేస్తే.. దాన్ని ఓవర్ టైమ్ కింద లెక్కలోకి తీసుకోనున్నారు. కంపెనీలు ఆ ఓవర్ టైమ్కి కూడా జీతం చెల్లించాల్సి ఉంటుంది.