Lakshmi Parvathi : ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను

లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ''ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల్ని ఖండిస్తున్నాను. విగ్రహాలపై దాడులు ఎవరు చేసినాతప్పే. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేసిన వారిని అరెస్ట్.........

Lakshmi Parvathi : ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను

Lakshmi Parvathi

Lakshmi Parvathi :  ఇవాళ సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆయన సమాధి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు లక్ష్మీ పార్వతి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల గురించి లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడుతూ.. ”ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల్ని ఖండిస్తున్నాను. విగ్రహాలపై దాడులు ఎవరు చేసినాతప్పే. ఎన్టీఆర్ విగ్రహంపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యహరించారు. ఈ ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నాను. ఎవరి విగ్రహాలపై దాడులు చేసి‌నా సహించకూడదు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలి” అని అన్నారు.

RGV : అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కొత్త మెగాస్టార్ అంటూ..

అంతే కాక ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను అంటూ ఆసక్తికర విషయాన్ని తెలియచేసింది లక్ష్మి పార్వతి. ”26 ఏళ్ళ తర్వాత ఒక రహస్యం చెప్తున్నాను. ఎన్టీఆర్ చనిపోయినప్పడు ఆయన ఆత్మతో మాట్లాడాను. జీవిత రాజశేఖర్ లు మద్రాస్ తీసుకెళ్ళి నన్ను ఒక అమ్మాయితో మాట్లాడించారు. ఎన్టీఆర్ ఆత్మ‌ ఓ 16ఏళ్ళ అమ్మాయిలో ప్రవేశించి నాతో అనేక విషయాలు పంచుకుంది.” అని తెలియచేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలకు ఉండాలి. ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలి. అందరికి మంచి చేసేలా చూడాలి అని లక్ష్మి పార్వతి మీడియాతో మాట్లాడింది.