Maha Accident : ఒకేసారి ఢీకొన్న ఎనిమిది వాహనాలు.. ముగ్గురు మృతి
మహారాష్ట్రలోని ధూలేలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొనటంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.
Maharashtra Accident : మహారాష్ట్రలోని ధూలేలో బుధవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఏడెనిమిది వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read more : Major Road Accident : బైక్ని ఢీకొన్న లారీ.. తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి
ధులే జిల్లాలోని బిజాసాని ఘాట్ మరియు పలాసనే మధ్య ముంబై-ఆగ్రా హైవేపై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వెలుగులోకి వచ్చిన కొన్ని ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో తెలియజేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఓ కారు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో క్షతగాత్రులు వాహనం నుంచి బయటకు రావడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఓ వాహనం మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Read more : Woman : ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం
Maharashtra | Three people died and one severely injured after 7-8 vehicles crashed into each other in Dhule on Wednesday, said police (27.10) pic.twitter.com/jSx9v6Iprw
— ANI (@ANI) October 28, 2021