Major Road Accident : బైక్‌ని ఢీకొన్న లారీ.. తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్‌‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.

Major Road Accident :  బైక్‌ని ఢీకొన్న లారీ.. తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

Major Accident

Major Road Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్‌‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఓ వ్యక్తి తన కుమార్తె, కుమారుడిటో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనకనుంచి వేగంవా వచ్చిన లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు ఘటన స్థలిలోనే మృతి చెందగా, కుమార్తె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.

చదవండి : Major Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది మృతి

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..అతి వేగానికి 8 మంది బలి