Mega Family : మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్ కథని సిద్ధం చేసిన మెగా మేనల్లుడు

మల్టీస్టారర్ సినిమా అంటే చాలా ఆలోచించాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ లు వచ్చేవి. అప్పటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలతో

Mega Family : మెగా ఫ్యామిలీతో మల్టీస్టారర్ కథని సిద్ధం చేసిన మెగా మేనల్లుడు

Mega Family

Mega Family :  మల్టీస్టారర్ సినిమా అంటే చాలా ఆలోచించాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో ఎక్కువగా మల్టీస్టారర్ లు వచ్చేవి. అప్పటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ అంటే చాలా లెక్కలు వేసుకోవాలి. ఇద్దరి ఇమేజ్ తగ్గకుండా కథని రాసుకోవాలి. ఇద్దరికీ సమానంగా పాత్ర ఉండాలి. అభిమానులని ఇంప్రెస్ చేయగలగాలి. మల్టి స్టారర్ సినిమా అయితే కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల మళ్ళీ మల్టీస్టారర్ లు మొదలు పెట్టారు. కొంతమంది చిన్న హీరోలతో మల్టీస్టారర్ లు చేస్తే కొంతమంది పెద్ద హీరోలతో ప్రయోగాలు చేస్తున్నారు.

ఇండస్ట్రీలో చాలా గ్యాప్ తర్వాత విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్లకి శ్రీకారం చుట్టారు. మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల’ తీసి సక్సెస్ అయ్యారు. ఊపిరి, బాహుబలి, మనం ఇలా పెద్ద హీరోలతోనే కాక చిన్న హీరోలతో కూడా మల్టీస్టారర్లు వస్తున్నాయి. ఇటీవల యువ హీరోల మల్టీస్టారర్లు వరుసగా వస్తున్నాయి. నాని సుధీర్ బాబు కలిసి ‘వి’ సినిమాతో మెప్పించారు. ఇప్పుడు సిద్దార్థ్, శర్వానంద్ కలిసి ‘మహా సముద్రం’ సినిమాతో రాబోతున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లతో రాజమౌళి ఏకంగా ‘ఆర్ఆర్ఆర్’ అంటూ పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. ఇక కొన్ని సినీ కుటుంబాలు వాళ్ళ కుటుంబంలోని హీరోలంతా కలిసి మల్టీస్టారర్ చేయాలి అని అనుకుంటారు. అక్కినేని ఫ్యామిలీ ‘మనం’ సినిమా చేసేసింది. మిగిలిన ఫ్యామిలీలు కూడా చేయాలని చూస్తున్నారు. కొంతమంది గెస్ట్ అప్పీరెన్స్ లు ఇస్తున్నారు కానీ ఫుల్ లెంగ్త్ మూవీ తీయలేదు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి మల్టీస్టారర్ అంటే కష్టమే. అంతమంది స్టార్ హీరోలని హ్యాండిల్ చేస్తూ కథ రాయడమంటే సాహసమే. చిరంజీవి సినిమాల్లో ఇదివరకు మెగా హీరోలు గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

Kondapolam : ‘కొండపొలం’ మూవీపై మెగాస్టార్ మెగా రివ్యూ

అయితే తాజాగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ‘కొండపొలం’ డైరెక్టర్ క్రిష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇటీవల ఈ దర్శకుడికి మెగా ఫ్యామిలీ హీరోలు అందరూ కలిసి నటించేలా వైష్ణవ్ తేజ్ ఒక కథను చెప్పినట్లు తెలియజేశాడు.

క్రిష్ మాట్లాడుతూ.. వైష్ణవ్ తేజ్ కు కథలు రాయడం అంటే కూడా చాలా ఇష్టం అని, అతను మెగా ఫ్యామిలీ అందరూ కలిసి నటించే విధంగా ఒక మంచి కథని రాసుకున్నాడు అని, ఆ కథను నాతో కూడా కొన్ని సార్లు చర్చించాడు అని, అంతేకాకుండా ఆ కథకి ఒక టైటిల్ కూడా సెట్ చేసుకున్నాడు అని చెప్పాడు. ఇదే కనక నిజమైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఇలా మెగా హీరోలందర్నీ ఒకే సినిమాలో చూడొచ్చు. ఈ మెగా స్టార్లంతా కలిసి సినిమా తీస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. కానీ ఇది చాలా కష్టమే. చూడాలి మరి ఈ మెగా మల్టీస్టారర్ వస్తుందో లేదో..