Blood Brothers : కరోనా బాధిత ‘బ్లడ్ బ్రదర్స్’ కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి..
కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు..
Blood Brothers: కరోనా సెకండ్ వేవ్లో తెలుగు రాష్ట్రాలలో కరోనా బారిన పడిన బ్లడ్ బ్రదర్స్ కుటుంబాలకు మెగాస్టార్ చిరంజీవి ఎంతో అండగా నిలిచారు. వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాని, ధైర్యాన్ని ఇస్తున్నారు. రక్తదాన కార్యక్రమాల సేవకులకు ఎవరికి కరోనా సోకిన వెంటనే వారితో మాట్లాడి ధైర్యం నింపడం.. అవసరమైతే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం.. ఆయా ఆస్పత్రులకు ఫోన్ చేసి డాక్టర్స్తో మాట్లాడటం చేస్తున్నారు.ఇలా నిత్యం అభిమానులను సినీ పరిశ్రమకు చెందినవారిని.. అందరితో మాట్లాడుతూ ఎందరినో కాపాడుతున్నారు..
ఈ మధ్య కాలంలో హిందూపురంకు చెందిన మెగా అభిమాని శ్రీ. K. ప్రసాద్ రెడ్డి కరోనాతో మరణించగానే వారి కుటుంబంతో మాట్లాడి ధైర్యాన్నిచ్చి వారి శ్రీ మతి K. పద్మావతి పేరున రూ.3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అదేవిధంగా కడపకు చెందిన శ్రీ N. రవిప్రసాద్ కూడా కరోనాతో మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా వారి అమ్మాయి ప్రియాంక పేరున 3 లక్షల రూపాయలు ఎఫ్.డి చేసి భరోసానిచ్చారు..
‘Blood brother’ Sri.K.Prasad Reddy R/o Hindupur succumbed to Covid 19. Sri. @KChiruTweets on 20th May’21 has provided financial assistance to the family by providing a Rs.3 lakh Fixed Deposit in the name of Smt.K.Padmavathi. #ChiruForCovidHelp pic.twitter.com/M1Sms1R9lz
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 21, 2021
అంతేకాకుండా గాజువాకలో కరోనాతో భార్యాభర్తలు శ్రీ K. శ్రీనివాస రావు- సరస్వతిలకు వైజాగ్లో ఆస్పత్రి బెడ్ దొరక్కపోవడంతో అధైర్యానికి గురయ్యారు. వారి కోసం వెంటనే మెగాస్టార్ సురక్ష హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్య సదుపాయలు కల్పించడమే కాకుండా వారి పేరున కూడా 2 లక్షల రూపాయలు ఎఫ్.డి చేశారు..
శ్రీకాకుళం – B.S.S ప్రసాద్ కుమార్ (టైకూన్ శ్రీనివాస్) కరోనా బారిన పడితే వారికి ఒక లక్షరూపాయలు ఆర్ధిక సహాయం చేసి ఆదుకున్నారు. ఈ విధంగా కరోనా కష్టకాలంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా.. కేవలం అభిమానులు మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో వారికి బంధువులకు, మిత్రులకు తమ సిబ్బందికి ప్రతిరోజూ ఎన్నో గుప్త దానాలు చేస్తూనే ఉన్నారు..
Sri.K.Srinivasa rao & Smt.Saraswathi, couple from Gajuwaka were provided with a fixed deposit of Rs.2 Lakhs. Sri. @KChiruTweets personally spoke with Suraksha Hospital – Vizag management to provide them with beds and urgent treatment for Covid.#ChiruForCovidHelp pic.twitter.com/835TSopyeM
— ChiranjeeviCharitableTrust (@Chiranjeevi_CT) May 21, 2021
తమను ఆపదలో ఆదుకున్న ఆపద్భాందవుడు మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెబుతూ బ్లడ్ బ్రదర్స్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. వారికి సంబంధించిన సోషల్ మీడియా వీడియోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారాయి. కె.ప్రసాద్ రెడ్డి భార్య పద్మావతి.. బీఎస్.ఎస్ ప్రసాద్ కుమార్ కుటుంబీకులు.. గాజువాక శ్రీనివాసరావు కుటుంబీకులు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వీడియో సందేశాన్ని అందించారు. ఆపదలో తమను ఆదుకున్న దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు అంటూ బాధిత కుటుంబీకులు కొనియాడారు..