#BharatJodoYatra: భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ తో క‌లిసి పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ

జ‌మ్మూక‌శ్మీర్ లోని అవంతిపొరాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కొన‌సాగిస్తున్న భార‌త్ జోడో యాత్ర‌లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహ‌బూబా ముఫ్తీ పాల్గొన్నారు. నిన్న జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ఈ యాత్ర‌లో రాహుల్ తో క‌లిసి న‌డిచిన విష‌యం తెలిసిందే.

#BharatJodoYatra: భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ తో క‌లిసి పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ

#BharatJodoYatra

#BharatJodoYatra: జ‌మ్మూక‌శ్మీర్ లోని అవంతిపొరాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కొన‌సాగిస్తున్న భార‌త్ జోడో యాత్ర‌లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహ‌బూబా ముఫ్తీ పాల్గొన్నారు. నిన్న జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ఈ యాత్ర‌లో రాహుల్ తో క‌లిసి న‌డిచిన విష‌యం తెలిసిందే.

ఇవాళ ఉద‌యం భార‌త్ జోడో యాత్ర అవంతొపొరా నుంచి ప్రారంభ‌మైంది. అనంత‌రం రాహుల్, ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి ముఫ్తీ పాద‌యాత్ర‌లో పాల్గొన్నారు. మ‌రోవైపు, కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంకా గాంధీ కూడా శ్రీ‌న‌గర్ చేరుకున్నారు. మ‌రో రెండు రోజుల్లో భార‌త్ జోడో యాత్ర ముగియ‌నున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ నేతలు ఇందులో భారీగా పాల్గొనే అవ‌కాశం ఉంది.

రెండు రోజుల పాటు ప్ర‌జ‌లు కూడా పెద్ద ఎత్తున ఈ యాత్ర‌లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌డంతో భ‌ద్ర‌త‌ను పెంచారు. ఎల్లుండి శ్రీ‌న‌గ‌ర్ లో కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయ‌నుంది. దీనికి కాంగ్రెస్ నేత‌లే కాకుండా ఇత‌ర పార్టీల నేత‌లు కూడా హాజ‌రు అవుతారు. క‌న్యాకుమారి నుంచి రాహుల్ గాంధీ ఈ యాత్రను ప్రారంభించారు.

#IND vs NZ: ఆట‌లో ఇలాంటి ఓట‌మి స‌హ‌జ‌మే: వాషింగ్ట‌న్ సుంద‌ర్