PM Modi: 8 ఏళ్ల పాలనపై 31న అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ: జైరాం ఠాకూర్
ప్రధాని మోదీ ఈ నెల 31న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో తమ రాష్ట్రంలోని షిమ్లా నుంచి సమావేశమవుతారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు.
PM Modi: ప్రధాని మోదీ ఈ నెల 31న దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ విధానంలో తమ రాష్ట్రంలోని షిమ్లా నుంచి సమావేశమవుతారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Gujarat : 8 ఏళ్ల పాలనలో గాంధీజీ, పటేల్ కలల సాకారానికి కృషి చేశాం : ప్రధాని మోడీ
షిమ్లాలోని రిడ్జ్ మైదానంలో ఈ నెల 31న జరిగే బహిరంగ సభకు మోదీ హాజరుకానున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను జయరాం ఠాకూర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రిడ్జ్ మైదానంలో ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడతారని తెలిపారు. ఎనిమిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మోదీ హిమాచల్ ప్రదేశ్కు వస్తున్నందుకు తమ రాష్ట్ర ప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
West Bengal: కుమారుడిని చెరువులో ముంచి చంపిన తండ్రి
మోదీ పర్యటన సందర్భంగా దేశంలోని అన్ని జిల్లాల బీజేపీ ప్రధాన కార్యాలయాల నేతలతోనూ మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడతారని చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. కాగా, ఈ నెల 30తో మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఆ రోజు నుంచి వచ్చే నెల 14 వరకు దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాలని బీజేపీ ప్రణాళికలు వేసుకుంది.