AHA : జడ్జిగా మారనున్న నిత్యా మీనన్.. ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌లో సరికొత్త ఎంట్రీ

తెలుగు ఓటీటీ ఆహా రోజు రోజుకి సరికొత్త షోలతో, సినిమాలతో అలరిస్తుంది. ఆహా నుంచి ఇటీవల మరో కొత్త షోని ప్రకటించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రాం పేరుతో సరి కొత్త షోని........

AHA : జడ్జిగా మారనున్న నిత్యా మీనన్.. ‘ఆహా’ తెలుగు ఇండియన్ ఐడల్‌లో సరికొత్త ఎంట్రీ

Nithya

Nithya Menan :  తెలుగు ఓటీటీ ఆహా రోజు రోజుకి సరికొత్త షోలతో, సినిమాలతో అలరిస్తుంది. ఆహా నుంచి ఇటీవల మరో కొత్త షోని ప్రకటించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ ప్రోగ్రాం పేరుతో సరి కొత్త షోని మొదలు పెట్టింది ఆహా. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇందుకోసం చాలా మంది సింగర్స్ వచ్చారు. మరి కొద్దీ రోజుల్లోనే ఈ షో మొదలవ్వనుంది. అయితే ఈ షోకి ఇండియన్ ఐడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీరామచంద్ర హోస్ట్ చేయనున్నారు. ఇప్పటికే ఈ షోకి తమన్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. తాజాగా మరో ఇద్దర్ని కూడా జడ్జిలుగా అనౌన్స్ చేశారు.

‘అలా మొదలైంది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా మీనన్ ఒక పక్క నటిగా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు సింగర్ గా కూడా పాటలు పాడుతుంది. చాలా సినిమాల్లో నిత్యా మీనన్ సింగర్ గా పాటలు పాడింది. తాజాగా నిత్యా మీనన్ ని ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ కి జడ్జిగా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు హీరోయిన్ గా, సింగర్ గా అలరించిన నిత్యా ఇప్పుడు జడ్జిగా సరికొత్త అవతారం ఎత్తబోతుంది. అలాగే నిత్యా మీనన్ తో పాటు సింగర్ కార్తిక్ కూడా ఈ షోకి జడ్జిగా వ్యవహరించనున్నారు.

Sunny Leone : 2000 రూపాయల లోన్ కోసం సన్నీ లియోన్ పాన్ కార్డు వాడకం.. ట్విట్టర్లో సన్నీ కంప్లైంట్

తాజాగా తమన్, నిత్యా మీనన్, కార్తీక్ లు ముగ్గురు కలిసి ఉన్న ఓ ప్రోమోని విడుదల చేశారు. ఈ ప్రోమో అందర్నీ ఆకట్టుకుంటుంది. తెలుగు సింగెర్స్ ని బయటకి తీసుకురావడానికి మొదలు పెట్టిన ఈ సరికొత్త షో త్వరలో ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది.