SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేశ్ బాబుతోనే అదీ సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకా పాన్ వరల్డ్ స్తాయిలో ఉంటుందని చెప్పి, ఆ సినిమాపైన అటు రాజమౌళి, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ లో..............

SSMB 29 : ప్యారిస్ ఫేమస్ 3డి యానిమేషన్ స్టూడియోలో రాజమౌళి.. మహేష్ సినిమా కోసమేనా??

Rajamouli

SSMB 29 :  టాలీవుడ్ సినిమాలతో పాన్ ఇండియా సక్సెస్ కొట్టొచ్చని ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాజమౌళి. ఆయన సినిమాలు విజువల్ వండర్ గా ఉండటానికి కారణం టెక్నాలజీని ఆయన వాడుకున్నంతగా మరే డైరెక్టరూ వాడుకోవడం లేదు. లేటెస్ట్ గా ప్యారిస్ లోని యూనిట్ ఇమేజ్ అనే ఫేమస్ 3డి యానిమేషన్ అండ్ VFX స్టూడియోను సందర్శించి, ఆ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. యునిట్ ఇమేజ్ యానిమేషన్ స్టూడియోలో సినిమాలకు సంబంధించిన మొత్తం సీజి, VFX వర్క్స్ జరుగుతాయి. ఇంకేముంది అసలు ఆ స్టూడియోకి జక్కన్న సూపర్ స్టార్ సినిమా కోసమే వెళ్లాడనే చర్చ హాట్ హాట్ గా నడుస్తోంది.

ఈ ఫోటోని రాజమౌళి ట్విట్టర్లో షేర్ చేసి..” పారిస్ లోని ఫేమస్ 3డి యానిమేషన్ అండ్ VFX స్టూడియో యూనిట్ ఇమేజ్ ని సందర్శించాను. ఇక్కడి వాళ్ళు మా ప్రశ్నలన్నిటికీ, సందేహాలకు చాలా చక్కగా సమాధానం తెలిపారు. త్వరలోనే కలిసి పని చేయబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ వర్క్ త్వరలోనే మొదలుపెడతాం” అని పోస్ట్ చేశారు.

ట్రిపుల్ ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా మహేశ్ బాబుతోనే అదీ సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకా పాన్ వరల్డ్ స్తాయిలో ఉంటుందని చెప్పి, ఆ సినిమాపైన అటు రాజమౌళి, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ లో భారీ హోప్స్ కలిగించారు రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడిలా హాలీవుడ్ యునిట్ ఇమేజ్ స్టూడియోకు వెళ్లి మహేశ్ బాబు ఫ్యాన్స్ కు మరిన్ని అంచనాలు పెంచేశారు జక్కన్న. ఇంకే ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్టయిపోయాయని చర్చించుకుంటున్నారు మహేశ్ ఫ్యాన్స్. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని, ఈ సినిమా కోసం మహేశ్ బాబు 3 ఇయర్స్ పక్కా డేట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఇప్పటికే ఓ అంచనాకొస్తున్నారు.

Allari Naresh : ఓట్ల కోసం నరేష్ ప్రయాణం.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం టీజర్ రిలీజ్..

ప్రస్తుతం యూరప్ టూర్ లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు అక్కడ బిల్ గేట్స్ తో దిగిన ఫోటో షేర్ చేసి, ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేశారు. త్వరలో ఇండియాకి తిరిగిరానున్న మహేశ్ బాబు.. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నారు. మహేశ్ 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జులై చివరి వారంలో సెట్స్ మీదకి వెళ్లనుందని సమాచారం.