RC15: చెర్రీ మొదలు పెట్టేస్తున్నాడు.. అమృత్ సర్ లో శంకర్ సినిమా రీస్టార్ట్
ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమపడిన రామ్ చరణ్..
RC15: ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమపడిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తర్వాత తమిళ దర్శకుడు శంకర్ తో మరో పాన్ ఇండియా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత షూటింగ్ కూడా పూర్తవగా మిగిలిన షూటింగ్ కోసం ఇప్పుడు మళ్ళీ కొత్త షెడ్యూల్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
Ram Charan : ఒక్క పాటకి 20 కోట్లు.. RC15లో మరో అద్భుతం సృష్టించనున్న శంకర్..
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ముంబై, పుణెలలో రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తవగా గోదావరి జిల్లాలలో కూడా ఒక షెడ్యూల్ పూర్తిచేశారు. కాగా, ఇప్పుడు పంజాబ్ అమృత్ సర్ లో కొంత షూటింగ్ చేయనున్నారు. ఏప్రిల్ 6 నుంచి అమృత్ సర్ వెళ్లనున్న టీమ్ దాదాపు 25 రోజులు లాంగ్ షెడ్యుల్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక పాటకే 20 కోట్లు ఖర్చు పెట్టనున్నారని సమాచారం.
Ram Charan : షూటింగ్ కూడా పూర్తవ్వలేదు.. కానీ అప్పుడే బిజినెస్ అయిపోయిన RC15
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. హీరో శ్రీకాంత్, మలయాళం స్టార్ హీరో సురేష్ గోపి విలన్ రోల్స్ లో చేయనున్నారని తెలుస్తుండగా.. సునీల్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడట. అన్నీ అనుకుంటున్నట్లు ప్లానింగ్ ప్రకారం జరిగితే ఈ సినిమా 2023 సంక్రాంతికి విడుదల చేస్తామని దర్శకుడు శంకర్ ఇప్పటికే ప్రకటించగా.. దాని కోసమే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.