Raviteja : స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..?
టాలీవుడ్ స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా లాగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్..
![Raviteja : స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..? Raviteja : స్టార్ సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా.. మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్..?](https://10tv.in/wp-content/uploads/2023/06/Raviteja-announce-his-73-movie-with-cinematographer-Karthik-Gattamneni.jpg)
Raviteja announce his 73 movie with cinematographer Karthik Gattamneni
Raviteja – Karthik Gattamneni : మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో రవితేజ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే రవితేజ మరో మూవీని అనౌన్స్ చేసేస్తున్నాడు. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనితో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Gladiator 2 : గ్లాడియేటర్ సెట్లో భారీ అగ్ని ప్రమాదం.. ఇంతటి ప్రమాదం ఎప్పుడు చూడలేదంటున నిర్మాత!
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మించబోతోంది. ఈ మూవీ టైటిల్ ని రేపు సాయంత్రం 6:03 గంటలకు అనౌన్స్ చేస్తామంటూ ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఇక ఆ వీడియోలో చెప్పుకొచ్చిన ఒక స్టేట్మెంట్ అందరిలో మూవీ పై ఆసక్తి కలిగిస్తుంది. “ఆ లావాకి ఒక పేరుంది. ఆ పేరుకి ఒక ప్రతిధ్వని ఉంది. ఆ ప్రతిధ్వని ఒక ప్రకంపనం పుట్టిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు. చూస్తుంటే ఈ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. కాగా దర్శకుడు కార్తీక్.. పాన్ ఇండియా హిట్టుగా నిలిచిన కార్తికేయ 2 తో పాటు రవితేజ సినిమాలు ధమాకా, డిస్కో రాజా సినిమాలకు కూడా సినిమాటోగ్రాఫర్ చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
Kriti Sanon : అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. అమ్మకి ఫోన్ చేసి ఏడ్చేశాను.. కృతి సనన్!
ఇక టైగర్ నాగేశ్వరరావు విషయానికి వస్తే.. ఒక్కప్పుడు స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కొత్త దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్ (Renu Desai) చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇక ఈ సినిమాని అక్టోబర్ 20న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
మరో 24 గంటల్లో ప్రకంపనం 💥
Mass Maharaja @RaviTeja_offl & @Karthik_gatta‘s#MASSiveEruption – #RT73 Title Announcement Video, Tomorrow at 6:03PM.
Stay tuned 🥁@vishwaprasadtg @vivekkuchibotla@manibkaranam @sujithkolli pic.twitter.com/igZ5gsmgac
— People Media Factory (@peoplemediafcy) June 11, 2023