Samantha : కరోనా కోసం కదిలొచ్చిన సమంత, మంచు లక్ష్మి

కరోనా సమయంలో చాలా మంది సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కొంతమంది నేరుగా సహాయం చేస్తే కొంతమంది సేవాసంస్థల ద్వారా సహాయం చేశారు. తాజాగా సృష్టి గ్యాలరీ సంస్థ సెలబ్రిటీలతో

Samantha : కరోనా కోసం కదిలొచ్చిన సమంత, మంచు లక్ష్మి

Sam (1)

Samantha : కరోనా సమయంలో చాలా మంది సెలబ్రిటీలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కొంతమంది నేరుగా సహాయం చేస్తే కొంతమంది సేవాసంస్థల ద్వారా సహాయం చేశారు. తాజాగా సృష్టి గ్యాలరీ సంస్థ సెలబ్రిటీలతో పెయింట్స్ వేయించి వాటిని అమ్మకానికి పెట్టి ఆ వచ్చిన డబ్బులతో కరోనా బాధితులకు సహాయం చేయడం ప్రారంభించింది.

Shakini Dakini : శాకిని.. డాకిని.. కొరియన్ రీమేక్ లో రెజీనా.. నివేదా..

ఇటీవల ఈ సంస్థ కోసం సమంత వచ్చి పెయింట్ వేసింది. గత వరం సమంత పెయింట్ వేస్తూ ఉన్న ఓ ఫోటోని షేర్ చేసి పెయింటింగ్ రాకపోయినా సరే ఇలా వేసేశాను. ఓ మంచి పని కోసం చేస్తోన్న కార్యక్రమంలో భాగస్వామిని అయ్యాను అంటూ సమంత తెలిపింది. కరోనా వల్ల బాధపడే వారి కోసం ఈ పెయింటింగ్ వేశామని సమంత ‘సృష్టి’ సంస్థ గురించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Rajamouli : నా భార్యే నన్ను పోషించింది : రాజమౌళి

తాజాగా సమంత దారిలోనే మంచు లక్ష్మీ కూడా తన కూతురు విద్యతో కలిసి పెయింటింగ్ వేసింది. ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇలా ఫ్రెండ్స్ అందరితో కలిసి మనస్ఫూర్తిగా పెయింటింగ్ వేయడం ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా కూతురు యాపిల్‌తో కలిసి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఇలా చేయడంతో నాకు భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలిగింది. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని ఇంతలా ఆనంద పరిచినందుకు లక్ష్మి నంబియార్, మనోహర్ చిలువేరుకు థ్యాంక్స్ అని తెలిపింది.