India vs New Zealand: రేపటి నుంచి వన్డే మ్యాచులు… ట్రోఫీతో భారత్-న్యూజిలాండ్ సారథులు ఫొటోలు

భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో తొలి వన్డే జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. రేపటి నుంచి జరిగే మూడు వన్డే మ్యాచుల సిరీస్ ను శిఖర్ ధావన్ సారథ్యంలో ఆడనుంది.

India vs New Zealand: రేపటి నుంచి వన్డే మ్యాచులు… ట్రోఫీతో భారత్-న్యూజిలాండ్ సారథులు ఫొటోలు

India vs New Zealand

Updated On : November 25, 2022 / 11:33 AM IST

India vs New Zealand: భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో తొలి వన్డే జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. రేపటి నుంచి జరిగే మూడు వన్డే మ్యాచుల సిరీస్ ను శిఖర్ ధావన్ సారథ్యంలో ఆడనుంది.

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్, భారత కెప్టెన్ శిఖర్ ధావన్ ఇవాళ ట్రోఫీని ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆక్లాండ్ చేరుకున్న భారత క్రికెటర్లతో కొందరు అభిమానులు ఫొటోలు తీసుకున్నారు.

రేపు ఉదయం 7 గంటలకు ఈడెన్ పార్క్ లో మ్యాచ్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్ వెళ్లలేదు. దీంతో టీ20కి హార్దిక్ పాండ్యా, వన్డేలకు శిఖర్ ధావన్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీ20 సిరీస్ ముగియడంతో హార్దిక్ పాండ్యా భారత్ చేరుకున్నాడు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..