telangana congress: రాహుల్ గాంధీతో సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ.. నేతల మధ్య విబేధాలకు చెక్ పడేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ..

telangana congress: రాహుల్ గాంధీతో సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ నేతల భేటీ.. నేతల మధ్య విబేధాలకు చెక్ పడేనా?

Telangana Congress

telangana congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అధిష్టానం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రం 5గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పయణమయ్యారు. రాహుల్ తో సమావేశమయ్యే వారిలో పొలిటికల్ ఎపైర్స్ కమిటీకి చెందిన 22 మంది నేతలతో పాటు మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు మొత్తం 38 మంది తెలంగాణ నేతలకు రాహుల్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌.. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి స్వీకరించిన తరువాత కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విబేధాలు పొడచూపుతున్నాయి. పార్టీలోని పలువురు సీనియర్లతో పాటు జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొంత మంది నేతలు పార్టీతో అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం వంటి పరిణామాలపై రాహుల్ తో భేటీ సమయంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్ లో అభ్యర్థి ఎంపిక, రాష్ట్రంలో జరిగిన ఇతర ఎన్నికల్లో పార్టీ వెనుకబాటుకు కారణాలు, తదితర అంశాలపై పార్టీ సీనియర్లు రాహుల్ గాంధీ వద్ద ప్రస్తావించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Telangana Congress : టి.కాంగ్రెస్ సీనియర్ల భేటీ…22న ఢిల్లీకి

అయితే రాహుల్ గాంధీతో భేటీతో రాష్ట్రంలో నేతల మధ్య వర్గ విబేధాలకు చెక్ పడేనా అన్నఅంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్లు, రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి, హనుమంత్ రావు అన్నట్లు పార్టీలో వర్గ విబేధాలు తారా స్థాయికి చేరాయి. కీలక నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొంటుండటంతో విబేధాలకు కారణమేంటి, వీటికి పుల్ స్టాప్ పెట్టాలంటే ఏ విధంగా ముందుకు సాగాలన్న అంశాలపై చర్చించి, అందరూ కలిసికట్టుగా రాబోయే ఎన్నికలకు వెళ్లేలా ఓ ప్రణాళికను రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 25న రాహుల్ గాంధీ వరంగల్ లో జరిగే బహిరంగ సభలో పాల్గోనున్నారు. ఆ అంశంతో పాటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చేయాల్సిన పోరాటాలపై దిశానిర్దేశం
,పార్టీ లో జరుగుతున్న పరిణామాలను రాహుల్ కు సీనియర్లు వివరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.