Acharya: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్కు సర్ప్రైజ్ గెస్ట్..?
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో....
Acharya: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.
Acharya: ఆచార్య కోసం మహేష్ బాబు.. నిజమేనా?
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ను తాజాగా నిర్ణయించారు చిత్ర యూనిట్. ఆచార్య గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఏప్రిల్ 23న సాయంత్రం 6 గంటల నుండి నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియెన్స్ కూడా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్కు గెస్ట్ ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు. గతంలో ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్కు ఏపీ సీఎం జగన్ వస్తారనే వార్తలు వినిపించాయి.
Acharya Pre Release Event: అన్న కోసం తమ్ముడు.. అభిమానులకు కన్నుల పండుగ!
ఆ తరువాత ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తాడని.. లేటెస్ట్గా దర్శకధీరుడు రాజమౌళి వస్తాడని అంటున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్కు ఓ సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అని తెలుస్తోంది. నిజానికి ఆచార్య చిత్రంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో తమ సినిమాకు మహేష్ చేత ప్రమోషన్ చేయిస్తే కలిసొస్తుందని కొరటాల భావించడం.. మహేష్ను రిక్వెస్ట్ చేయడం వరుసగా జరిగిపోయాయట. అయితే మహేష్ కూడా ఈ ఈవెంట్కు సర్ప్రైజ్ గెస్ట్గా రావడానికి ఓకే అన్నట్లుగా తెలుస్తుంది. మరి నిజంగానే ఆచార్య కోసం సర్ప్రైజ్ గెస్ట్గా మహేష్ రాబోతున్నాడా.. లేక ఇది కూడా మిగతా వార్తల్లా కేవలం గాసిప్గానే మిగిలిపోతుందా అనేది తెలియాలంటే ఎల్లుండి వరకు వెయిట్ చేయాల్సిందే.