T20 World Cup 2021: పాక్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఫ్రీ టికెట్లు

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఫ్రీ టికెట్లు ఇష్యూ చేసిందా కంపెనీ. అక్టోబర్ 24 ఆదివారం సాయంత్రం 7గంటల 30నిమిషాలకు మొదలవుతున్న మ్యాచ్ కు... బ్లూ కాలర్ వర్కర్లకు ఉచితంగా...

T20 World Cup 2021: పాక్‌తో టీమిండియా మ్యాచ్‌కు ఫ్రీ టికెట్లు

India Pakistan

T20 World Cup 2021: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఫ్రీ టికెట్లు ఇష్యూ చేసిందా కంపెనీ. అక్టోబర్ 24 ఆదివారం సాయంత్రం 7గంటల 30నిమిషాలకు మొదలవుతున్న మ్యాచ్ కు… బ్లూ కాలర్ వర్కర్లకు ఉచితంగా టికెట్లు ఇచ్చారు. దనుబె గ్రూప్ వైస్ ఛైర్మన్ అనీస్ సాజన్ సొంత ఖర్చులతో టికెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. దాంతో పాటు ఇండియాతో క్వాలిఫైయింగ్ టీం, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లకు కూడా ఫ్రీగా ఇస్తారు.

ఇండో-పాకిస్తాన్ మ్యాచ్ లు తరచుగా జరిగేవి కాదు. 2 లేదా 4 సంవత్సరాలకోసారి జరుగుతుంది. రోజూ శ్రమించి పనిచేసే వారికి కాస్త ఉత్సాహాన్ని జోడించాలని అనుకుంటున్నాం. మ్యాచ్ చూడటం కోసం కేవలం హాఫ్ డే వర్క్ మాత్రమే చేసుకోమని కూడా స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం. స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూసేందుకు ట్రాన్స్ పోర్ట్ తో పాటు ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇస్తామని అన్నారు.

తమ ఫేవరేట్ ఫ్యాన్ జెర్సీలు కూడా ఇచ్చి కింద మిస్టర్ క్రికెట్ యూఏఈ సంతకంతో జాకెట్స్, క్యాప్స్ పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ స్టేడియంకు వెళ్లలేని వారైతే అటువంటి వారి కోసం స్క్రీనింగ్స్ సైతం ఏర్పాటు చేశారు.

………………………………………..: India vs Pakistan Live Updates

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ఇదే. దీని కోసం ఇరు దేశాల జట్లు కొన్ని వారాల క్రితమే ఇక్కడికి వచ్చి ప్రిపరేషన్ మొదలుపెట్టాయి. అక్కడి క్లబ్బులు, ఎంటర్‌టైన్మెంట్ ఏరియాలు మొత్తం బిగ్ స్క్రీన్లతో అరేంజ్ చేశారు. యూఎస్ఏ, ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్తాన్ ల నుంచి యూఏఈ చేరుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అవుతున్నారు.