T20 World Cup 2021: తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ ఉంటాడా.. కోహ్లీకి సూటి ప్రశ్న

టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిని చవిచూసింది. 10వికెట్ల తేడాతో కోహ్లీసేనను చిత్తు చేసిన పాక్.. రోహిత్ ను డకౌట్ చేయడంతోనే.....

T20 World Cup 2021: తర్వాతి మ్యాచ్‌లో రోహిత్ ఉంటాడా.. కోహ్లీకి సూటి ప్రశ్న

Team India

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌లోనే పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓటమిని చవిచూసింది. 10వికెట్ల తేడాతో కోహ్లీసేనను చిత్తు చేసిన పాక్.. రోహిత్ ను డకౌట్ చేయడంతోనే ఆధిక్యాన్ని ఆరంభించింది. దాదాపు టీ20 ఫార్మాట్ లో గత మ్యాచ్ ప్రదర్శన ఆధారంగా తర్వాతి జట్టు కూర్పును ఎంచుకునే కోహ్లీ.. ఈ సారి రోహిత్ శర్మను జట్టులో ఉంచుకుంటాడా తీసేస్తాడా అని అడిగిన ప్రశ్నకు కోహ్లీ స్పందించాడు.

రోహిత్ శర్మ టీమ్ మేట్ ముంబై ఇండియన్స్ మరో బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ను బెంచ్ కే పరిమితం చేశారు. రోహిత్ బదులుగా ఇషాన్ తీసుకుంటే బాగుండేదని మీరనుకుంటున్నారా.. అని వచ్చిన క్వశ్చన్ కు నవ్వుతూ.. ఊహించని ప్రశ్న ఇది అంటూ కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ.

‘ఇది చాలా ధైర్యం చేసి అడుగుతున్నాం. మీరేమనుకుంటున్నారు. రోహిత్ బదులు ఇషాన్ ను తీసుకుంటే బాగుండేదనా’? అని ప్రశ్న వచ్చింది.

…………………………………………..: శ్రీరెడ్డి చీరవిప్పి రోడ్డెక్కినపుడే తెలిసింది.. ‘మా’ అనేది ఉందని!

దానికి రెస్పాండ్ అయిన కోహ్లీ.. ‘బెస్ట్ అనుకున్న పదకొండు మందితో మ్యాచ్ ఆడించాను. మీరేమనుకుంటున్నారు. మీ అభిప్రాయమేంటి. రోహిత్ శర్మను టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి డ్రాప్ అవమంటున్నారా.. అతను చివరి గేమ్ లో ఎలా ఆడాడో మీకు తెలుసా.. అంటూ నవ్వుతూ కౌంటర్ వేసిన కోహ్లీ.. అస్సలు ఊహించలేని ప్రశ్న ఇది. మీకు కాంట్రవర్సీ కావాలంటే ముందే చెప్పండి. దానికి తగ్గట్లుగానే మాట్లాడతానని రెస్పాండ్ అయ్యాడు.

పైగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేంత తీరిక తనకు లేదని దాటేశాడు.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాస్ గెలిచిన తర్వాత షహీన్ అఫ్రీది.. 6/2తో జట్టులో పాక్ జట్టులో ఉత్సాహాన్ని పెంచారు. రోహిత్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం, ఆ తర్వాతే రాహుల్ పెవిలియన్ బాటపట్డం, సూర్యకుమార్ యాదవ్ 6,4 బాది హసన్ అలీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 49 బంతుల్లో 57పరుగులు చేయడంతో ఇండియా 20ఓవర్లలో 151పరుగులు మాత్రమే చేసింది. చేధనలో పాక్ ఓపెనర్లు 152పరుగులు లక్ష్యాన్ని అవలీలగా సాధించారు.