Kamareddy : గురువారం పుట్టిన రోజు..ప్రతిభాశాలి..కరోనాతో మృతి

మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Kamareddy : గురువారం పుట్టిన రోజు..ప్రతిభాశాలి..కరోనాతో మృతి

Covid Died NZB

Talented Women : కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి ప్రముఖులు, సెలబ్రెటీలు సైతం వైరస్ బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. తాజాగా..మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం వస్తే..తిరుమలకు వస్తానని మొక్కుకుంది. అనుకున్నట్లుగానే ఉద్యోగం వచ్చింది. తిరుమలకు వెళ్లి రాగానే కొద్ది రోజులకు కరోనా వచ్చింది. ఇంట్లోనే ఉంది. గురువారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. శుక్రవారం తుదిశ్వాస విడవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సదాశివనగర్ మండలం పద్మజివాడికి జాదవ్ విజయ్ (27) తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా రెండేళ్లు విధులు నిర్వహించారు. తర్వాత అటవీ బీట్ అధికారిణిగా ఎంపికయ్యారు. కానీ ఎందుకో అందులో చేరలేదు. మూడు నెలల కిందట గ్రూప్స్ ఫలితాల్లో రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికయ్యారుర. దీంతో పంచాయతీ కార్యదర్శి పోస్టుకు రాజీనామా చేసి ఆ ఉద్యోగం చేరారామె.

ఉద్యోగం వస్తే తిరుమలకు వెళ్లి వస్తానని జాదవ్ విజయ్ మొక్కుకున్నారు. పది రోజుల క్రితం అక్కడకు వెళ్లి వచ్చి విధుల్లో చేరారు. అనంతరం కరోనా పాజిటివ్ గా వచ్చిందని తేలింది. నాలుగు రోజులుగా ఇంట్లోనే చికిత్స తీసుకుంది. గురువారం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున జాదవ్ విజయ్ తుదిశ్వాస విడించారు.

Read More : Second Wave Of COVID : కరోనా టైం.. పిల్లలు భద్రం సుమా