Fire Accident : ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో రోగులు

చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న రోగుల్ని సురక్షితంగా కాపాడి మరో ఆస్పత్రికి తరలించారు.

Fire Accident : ప్రభుత్వ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో రోగులు

Fire Accident

Fire Accident: చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం (ఏప్రిల్ 27,2022) 11 గంటల సమయంలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆసుపత్రిలో ఒక్కసారిగా భారీగా పొగ కమ్ముకుంది. పొగవల్ల రోగులు శ్వాసతీసుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు.

మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలో సుమారు 50 మంది రోగులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న రోగులను బయటకు తీసుకొచ్చి మరో ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రక్రియలో అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది పాల్గొన్నారు.అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంద్రి సుబ్రమణియన్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.