Telangana : గురుకుల ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. బోధన, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana : గురుకుల ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Telangana

Telangana : గురుకుల పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బందికి పీఆర్సీ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్పీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత కొన్నేళ్లుగా పీఆర్సీ పెండింగ్ లో ఉంది.

పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక గురుకుల లోని ఇతర సొసైటీలలోని ఉద్యోగులకు కూడా త్వరాలు అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.