Minister KTR : సీఎం పోస్ట్ @ రూ.2500 కోట్లు-నడ్డాను ప్రశ్నించిన కేటీఆర్

తెలంగాణ‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

Minister KTR : సీఎం పోస్ట్ @ రూ.2500 కోట్లు-నడ్డాను ప్రశ్నించిన కేటీఆర్

Ktr And Jp Nadda

Minister KTR : తెలంగాణ‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వాటికి కౌంటర్‌గా   అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటి కప్పుడు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.

ఈరోజు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై విరుచుకు పడ్డారు. కర్ణాటకలో సీఎం సీటు కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా చేశారు.  ఈ విషయం మీ పార్టీ  ఎమ్మెల్యేలే చెబుతున్నారని ట్వీట్ చేశారు.  40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లు, 30 శాతం కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు చెబుతున్నారని…. వీటన్నిటిపై ఎలా స్పందిస్తారని నడ్డాను ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలైన  ఈడీ, సీబీఐ, ఐటీ  లకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా ? అని కేటీఆర్ నడ్డాను ట్విట్టర్ లో ప్రశ్నించారు.