Police Restrictions : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. పబ్ లు, క్లబ్ లు, హోటళ్లకు గైడ్ లైన్స్

స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను అమ్మొద్దని సూచించారు.

Police Restrictions : న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. పబ్ లు, క్లబ్ లు, హోటళ్లకు గైడ్ లైన్స్

New Year 11zon

police restrictions on New Year celebrations : న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసుల ఆంక్షలు విధించారు. పబ్ లు, క్లబ్ లు, హోటళ్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు. న్యూ ఇయర్ వేడుకలకు డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకున్న వారికి మాత్రమే వేడుకలకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పబ్ లు, రెస్టారెంట్ల వద్ద స్థానికులను ఇబ్బంది పెట్టొద్దని పేర్కొన్నారు.

స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితికి మించి పాస్ లను అమ్మొద్దని సూచించారు. పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవెంట్లలో జనాల్లోకి సింగర్స్ వెళ్లొద్దన్నారు. కోవిడ్ రూల్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Omicron Surge : న్యూ ఇయర్ వేడుకలపై ఏయే రాష్ట్రాలు నిషేధం విధించాయంటే?

ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలు విధించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం…జనవరి2, 2022 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించింది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూనే…నిర్వహించుకొనే సమావేశాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. థర్మల్ స్కానింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతొక్కరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించలని..భౌతిక దూరం మెంటైన్ చేయాలని సూచించింది.

కాగా, న్యూ ఇయర్ వస్తున్న క్రమంలో డిసెంబర్ 31న మద్యం దుకాణాలు,. బార్లు, స్పెషల్ ఈవెంట్స్ కు ప్రత్యేక అనుమతులు ఇస్తున్నట్లు తెలిపింది. మద్యం షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ కు రాత్రి 1 గంట వరకు విక్రయాలు జరుపుకోవడానికి అనుమతినివ్వడం జరుగుతుందని తెలిపింది.

Petrol Price : లీటర్ పెట్రోల్‌పై రూ.25 త‌గ్గింపు! ప్ర‌భుత్వం కొత్త సంవత్సరం కానుక..!!

మరోవైపు తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ..ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ప్రస్తుతం కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాకుండా.. నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ప్యాండమిక్, ఎపిడెమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు. ఒమిక్రాన్ ను కట్టడి చేయకుండా న్యూ ఇయర్ వేడుకలకు అనుమతినిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 62 ఒమిక్రాన్ కేసులున్నాయని కోర్టుకు తెలిపారు. ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుని..వేడుకలపై ఆంక్షలు పెట్టే విధంగా ఆదేశించాలని పిటిషనర్ కోరారు. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 30వ తేదీ గురువారం విచారిస్తామని హైకోర్టు వెల్లడించింది. హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.